AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద..

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం
Railway Bridge Collapsed In Mizoram
Srilakshmi C
|

Updated on: Aug 24, 2023 | 10:50 AM

Share

మిజోరాం, ఆగస్టు 24: నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద పడి మృతి చెందారు. ఇప్పటి వరకూ 22 మంది కార్మికుల మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కుప్ప కూలిన సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. అక్కడ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. భైరవి-సాయిరాంగ్ మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్ ఇది. వంతెన కుప్పకూలిన సంఘటనపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

రైల్వే అధికారుల బృందం, జోన్‌లోని సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి దే మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్