Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద..

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం
Railway Bridge Collapsed In Mizoram
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2023 | 10:50 AM

మిజోరాం, ఆగస్టు 24: నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద పడి మృతి చెందారు. ఇప్పటి వరకూ 22 మంది కార్మికుల మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కుప్ప కూలిన సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్లు సమాచారం. అక్కడ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద మరో నాలుగు మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. భైరవి-సాయిరాంగ్ మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్ ఇది. వంతెన కుప్పకూలిన సంఘటనపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

రైల్వే అధికారుల బృందం, జోన్‌లోని సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుందని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సబ్యసాచి దే మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి.

IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్
IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్
Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...
Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...
తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!
తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!
పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!
పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..
ఈ సుకుమారితో గెలిచే అందం ఈ విశ్వంలో లేదు.. ఎలిగెంట్ అమృత..
ఈ సుకుమారితో గెలిచే అందం ఈ విశ్వంలో లేదు.. ఎలిగెంట్ అమృత..
ఈ ఫోన్స్ ఉంటే కెమెరా వద్దంతారంతే.. ది బెస్ట్ ఫోన్లు ఇవే..!
ఈ ఫోన్స్ ఉంటే కెమెరా వద్దంతారంతే.. ది బెస్ట్ ఫోన్లు ఇవే..!
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. ఆ విషయాలు కూడా చెప్పాలంటూ..
ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. ఆ విషయాలు కూడా చెప్పాలంటూ..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..