కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి నో బయోమెట్రిక్‌.. ఆదేశాలు జారీ..

AP Government Decision: ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు జగన్‌ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా నుంచి ప్రభుత్వ ఉద్యోగులను...

కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి నో బయోమెట్రిక్‌.. ఆదేశాలు జారీ..
Cm Jagan
Follow us

|

Updated on: May 11, 2021 | 12:07 PM

AP Government Decision: ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు జగన్‌ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా నుంచి ప్రభుత్వ ఉద్యోగులను రక్షించుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పని వేళలను తాత్కాలికంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి ఉదయం11.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ.. వేతనాల చెల్లింపుతో అనుసంధానం చేస్తూ గతంలో ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా బయోమెట్రిక్‌ హాజరు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో గ్రామ, వార్డు సచి వాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరుతో జీతాల అనుసంధానాన్ని నిలుపుదల చేసింది., తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే గ్రామ, వార్డు వలంటీర్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!