AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తింటి వేధింపులు భరించలేక.. సచివాలయ ఉద్యోగి సూసైడ్! 8 నెలల గర్భిణీ భార్యపై కేసు

పిల్లనిచ్చిన అత్తమామతోపాటు 8 నెలల గర్భిణీ అయిన భార్య వేదింపులు తట్టుకోలేక సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

అత్తింటి వేధింపులు భరించలేక.. సచివాలయ ఉద్యోగి సూసైడ్! 8 నెలల గర్భిణీ భార్యపై కేసు
Secretariat Employee Suicide In Tirupati
Srilakshmi C
|

Updated on: Oct 18, 2025 | 5:14 PM

Share

తిరుపతి, అక్టోబర్‌ 18: కుటుంబ కలహాలతో ఉరివేసుకుని సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో నిరంజన్ (28) అనే వ్యక్తి సచివాలయం ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు భార్య విద్యప్రియతో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యతోపాటు మామ సుబ్రమణ్యం,అత్త చంద్రిక, హేమలతలు వేధింపులు గురిచేయడంతో తీవ మానసిక ఒత్తిడికి గురైన నిరంజన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె తరపు పుట్టింటి వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సాప్ ద్వారా పోలీసులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపిన నిరంజన్‌.. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో కందాడు గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద నున్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన చావుకు కారణమైన అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలని తన సందేశంలో నిరంజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను తననుంచి దూరం చేసి ఆమెకు వీరే పెళ్లి చేయాలని అత్తింటి వారు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని, వేరే కాపురం పెట్టాలని లేకుంటే అదనపు కట్నం కింద కేసులు పెడతామని భార్య ఇబ్బంది పెట్టినట్లు వాట్సాప్ మెసేజ్ లో నిరంజన్ పేర్కొన్నాడు. తను చేయని అప్పులకు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఆ డబ్బులతో జల్సాలు చేశారని ఆవేదన చెందాడు. ఇక నిరంజన్‌ సూసైడ్‌ విషయం తెలుసుకున్న ఏర్పేడు పోలీసులు, నీరంజన్ కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిరంజన్ భార్య విద్యప్రియ, మామ సుబ్రమణ్యం అత్త చంద్రిక, హేమలతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిరంజన్ భార్య విద్యప్రియ ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా