AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో హింస చెలరేగుతోంది. అఫ్ఘానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడును మరింత పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..
Afghanistan Taliban
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2021 | 7:23 AM

Share

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో హింస చెలరేగుతోంది. అఫ్ఘానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడును మరింత పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు. గురువారం రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా వశపరుచుకున్న తాలిబన్లు.. శుక్రవారం మరో కీలక పట్టణాన్ని సైతం స్వాధీనంలోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాబూల్‌-కాందహార్‌ జాతీయ రహదారిపై ఉన్న గజ్నీ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించిన అనంతరం.. కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తాలిబన్లు ముజాహిదీన్ నగరం వరకు వచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసినట్లు మీడియా వివరించింది. దీంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు నగారాన్ని వీడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. తాలిబన్లు కాందహార్, హెరాత్ నగరాలను స్వాధీనం చేసుకోవడం పెద్ద విజయంగా పేర్కొంటున్నారు.

గత కొన్ని రోజుల నుంచి తాలిబన్లు.. ఆఫ్ఘానిస్థాన్‌లోని 34 ప్రొవిన్షియల్ రాజధానులల్లో 12 కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మూడింట రెండు వంతుల ప్రాంతాలను తాలిబన్లు వశపరుచుకున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం.. తాలిబన్లకు కీలక ప్రాతిపాదనలు చేసినట్లు సమాచారం. హింసకు స్వస్థి పలికితే.. తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది. కాగా ఈ విషయంపై తాలిబన్లు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో తాలిబన్ల ప్రకటన కోసం ప్రభుత్వం వేచిచూస్తోంది.

ఇదిలాఉంటే.. మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే అవకాశమున్నట్లు అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాబూల్ లోని యూఎస్ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని తరలించేందుకు సైన్యాన్ని పంపనున్నట్లు అమెరికా ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో దాదాపు 3వేల మంది సైన్యాన్ని మోహరించి.. తమ సిబ్బందిని తీసుకెళ్లనున్నట్లు అమెరికా తెలిపింది. దీంతోపాటు బ్రిటన్ సైతం తమ ప్రజలను తీసుకెళ్లేందుకు సైన్యాన్ని పంపనున్నట్లు వెల్లడించింది.

Also Read:

Talibans: హింస మానితే అధికారంలో భాగస్వామ్యం.. తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్..?

Taliban: తాలిబన్ల అధీనంలో భారత ‘ఎటాక్ హెలికాప్టర్’ ! కుందుజ్ విమానాశ్రయం పూర్తిగా వశం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..