AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?

సాధారణంగా యుద్ధాలు రాత్రి చీకటి ముసుగులో జరుగుతాయి.. కానీ ఇది దానికి భిన్నం..ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం శనివారం ఉదయం భయంకరమైన పేలుళ్లతో వణికిపోయింది. ఎండలో ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలను బూడిద చేస్తూ, అమెరికా, ఇజ్రాయెల్ సంకీర్ణ సేనలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి తెరలేపాయి. దీంతో ఏమవుతుందనేది ఇరానీయులకు తెలియలేదు.

రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ ఎలా దాడి చేశాయో తెలుసా..?
Why Us Israel Launch Daylight Strikes On Tehran
Krishna S
|

Updated on: Mar 01, 2026 | 11:21 AM

Share

శనివారం ఉదయం.. టెహ్రాన్ నగర వాసులకు ఒక భయంకరమైన కలలా మిగిలింది. పాశ్చర్ జిల్లాపై దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త వ్యూహానికి తెరలేపాయి. సాంప్రదాయ యుద్ధ తంత్రాలకు భిన్నంగా.. చీకటి ముసుగులో కాకుండా ప్రకాశవంతమైన ఎండలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. సాధారణంగా దాడులు రాత్రి సమయంలో జరుగుతాయనేది ఇరాన్ సైన్యం భావన. జూన్ 2025లో జరిగిన దాడి కూడా తెల్లవారుజామున జరిగింది. సరిగ్గా ఇదే బలహీనతను అమెరికా-ఇజ్రాయెల్ సంకీర్ణం వాడుకుంది. స్థానిక సమయం ఉదయం 8:10 గంటలకు దాడులు మొదలుపెట్టడంతో.. రాత్రంతా అప్రమత్తంగా ఉండి, పొద్దున్నే అలసిపోయి షిఫ్ట్‌లు మార్చుకుంటున్న ఇరాన్ వాయు రక్షణ విభాగాలు ఏమీ చేయలేకపోయాయి.

పాలన మార్పు లక్ష్యంగా దాడులు

ఈ దాడుల ముఖ్య ఉద్దేశం కేవలం స్థావరాలను ధ్వంసం చేయడం కాదు ఇరాన్ ప్రభుత్వ అజేయతను ప్రజల ముందు బద్దలు కొట్టడం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరూ సమన్వయంతో మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి అని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో వైరల్ అవ్వడంతో.. డిసెంబర్ 2025 నుండి నిరసనలతో రగులుతున్న ఇరాన్ ప్రజల్లో ఇది ఒక కొత్త ఆశను, ధైర్యాన్ని నింపే టిప్పింగ్ పాయింట్‌గా మారింది.

ఖచ్చితమైన లక్ష్యాలు.. కనిపిస్తున్న ఆధిపత్యం

పగటి వెలుతురు కావడంతో అమెరికా, ఇజ్రాయెల్ పైలట్లు, డ్రోన్ ఆపరేటర్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించారు. ముఖ్యంగా మంత్రులు, సైనిక అధికారుల నివాసాలను సర్జికల్ స్ట్రైక్ లాగా లక్ష్యంగా చేసుకున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు.

ప్రపంచానికి హెచ్చరిక

ఈ పగటిపూట దాడి.. అమెరికా, ఇజ్రాయెల్ యొక్క పూర్తి వాయు ఆధిపత్యానికి నిదర్శనం. ఇరాన్ రక్షణ వ్యవస్థలు తమ ముందు ఎంత బలహీనమో ప్రపంచానికి చాటిచెప్పాయి. USS జెరాల్డ్ R ఫోర్డ్, USS అబ్రహం లింకన్ వంటి భారీ నావికా దళాలు ఎంతటి కఠినమైన చర్యలనైనా తీసుకోగలవని ఈ ఘటన రుజువు చేసింది. ఈ దాడులు ఆధునిక యుద్ధ తంత్రంలో మానసిక ఆధిపత్యం ఎంత ముఖ్యమో నిరూపిస్తున్నాయి.

Follow Us