టీటీడీ కీలక నిర్ణయాలు.. దాతలకు కొత్త నిబంధనలు, తిరుమలలో భారీ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్!
టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీమ్లకు విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో టిటిడి పలు మార్పులు చేసింది.తిరుమలలోని అన్నమయ్య భవనం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని టిటిడి ప్రకటించింది. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
