AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Shooting: ఇంగ్లాండ్‌‌లో కాల్పుల మోత.. దుండగుడితో సహా ఆరుగురు మృతి..

England Plymouth ఇంగ్లండ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన సామూహిక కాల్పుల్లో

Mass Shooting: ఇంగ్లాండ్‌‌లో కాల్పుల మోత.. దుండగుడితో సహా ఆరుగురు మృతి..
England Plymouth Shooting
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2021 | 7:48 AM

Share

England Plymouth Shooting: ఇంగ్లండ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇంగ్లాండ్‌లోని నైరుతి ప్రాంతంలోని ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన సామూహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడని కార్న్‌వాల్‌ పోలీసు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో పదేళ్ల లోపు చిన్నారి కూడా ఒకరు ఉన్నట్లు తెలిపారు. ఇంకా పలువురు గాయాలపాలయ్యారని.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో కీహామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఉగ్రవాద చర్య కాదని అధికారులు స్పష్టం చేశారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, యూకేలో గత 11 ఏండ్లలో సామూహిక కాల్పులు జరగడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో ప్లైమౌత్‌ పట్టణంలో భయాందోళన నెలకొంది.

Also Read:

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..

Crime News: దారుణం.. 9ఏళ్ల పాపపై అత్యాచారం.. కామంతో కళ్లు మూసుకుపోయిన మైనర్ బాలుడు..