Taliban: తాలిబన్ల అధీనంలో భారత ‘ఎటాక్ హెలికాప్టర్’ ! కుందుజ్ విమానాశ్రయం పూర్తిగా వశం

నెల రోజుల్లో కాబూల్ నగరాన్ని తాలిబన్లు పూర్తిగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోనే ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకోవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వేళ.. ప్రధానమైన కుందుజ్ విమానాశ్రయంలో వీరు తిష్ట వేశారని తెలుస్తోంది.

Taliban: తాలిబన్ల అధీనంలో భారత  'ఎటాక్ హెలికాప్టర్' ! కుందుజ్ విమానాశ్రయం పూర్తిగా  వశం
Taliban Seizes Mi 35 Attack Helicopter Gifted By India.
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 12, 2021 | 2:03 PM

నెల రోజుల్లో కాబూల్ నగరాన్ని తాలిబన్లు పూర్తిగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోనే ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకోవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వేళ.. ప్రధానమైన కుందుజ్ విమానాశ్రయంలో వీరు తిష్ట వేశారని తెలుస్తోంది. 2019 లో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం గిఫ్ట్ గా ఇచ్చిన ‘ఎటాక్ హెలికాఫ్టర్’ ఒకటి ఇప్పుడు వీరి అధీనంలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాడు ఆఫ్ఘన్ సర్కార్ కి ఇండియా ఇచ్చిన నాలుగు హెలీకాఫ్టర్లలో ఇది ఒకటి. వాటితో బాటు మూడు చీటా లైట్ యూటిలిటీ హెలికాఫ్టర్లు కూడా ఆ దేశ భద్రతా దళాలకు అందాయి. ఆఫ్గనిస్తాన్-బెలారస్ ఒప్పందం కింద భారత ప్రభుత్వం వీటిని అందజేసింది. పైగా ఆఫ్ఘన్ వైమానిక సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. కాగా ఈ హెలికాఫ్టర్ లోని రాడార్ బ్లేడ్స్ ని ఆఫ్ఘన్ దళాలు ముందే తొలగించినట్టు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే తాలిబన్ల నుంచి ఓటమి తప్పదని భావించి వీటిని తొలగించారని భావిస్తున్నారు. ఈ హెలికాఫ్టర్ వద్ద తాలిబన్లు తిరుగడుతున్నారంటే ఆఫ్ఘన్ దళాలకు వైమానిక మద్దతు కొరవడుతోందన్న విషయం కూడా స్పష్టమవుతోంది.

ఇప్పటికే ఆ దేశంలో తాలిబన్లు ఏడెనిమిదికి పైగా ప్రొవిన్షియల్ రాజధానులను హస్తగతం చేసుకున్నారు. ఈ నెల 31 తరువాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగిన అనంతరం ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇండియా తదితర దేశాల సాయం కోరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆ దేశానికి ఇండియా సైనిక పరంగా తోడ్పడే అవకాశాలు లేవు. తాలిబాన్లకు పాకిస్థాన్ మద్దతునిస్తున్న కారణంగా ఈ విధమైన యోచనేదీ ప్రభుత్వానికి లేదని అంటున్నారు. పైగా ఇండియా ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సైనిక పరమైన మద్దతు ఇవ్వరాదని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఇటీవల కోరాడు.

మరిన్ని ఇక్కడ చూడండి : హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.

 షూటింగ్స్ లో డేంజర్ బెల్స్.. స్టన్నింగ్‌ స్టంట్‌ చేసేప్పుడు సీన్ రివర్స్ అయితే…?:Danger Bells In Shooting Live video.

 పవన్‌ బర్త్‌డే గిఫ్ట్.. దిమ్మదిరిగే రేంజ్‌లో సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తున్న రానా చిత్రయూనిట్..:Pawan kalyan Birthday Video.

 బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు