AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత దేశంలోని వజ్రాల నగరంపై వైమానిక దాడికి పాల్పడ్డ మయన్మార్ సైన్యం

ఆగ్నేయాసియా దేశంలోని లాభదాయకమైన రత్నాల తవ్వకాల పరిశ్రమకు కేంద్రమైన మోగోక్ పట్టణంపై మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో గర్భిణీ స్త్రీతో సహా కనీసం 21 మంది మరణించారని మయన్మార్ ఆన్‌లైన్ మీడియా తెలిపింది. ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ప్రారంభమైన అంతర్యుద్ధం మధ్య ప్రతిఘటన సమూహాల నుండి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఈ దాడులు తీవ్రతరం అయ్యాయి.

సొంత దేశంలోని వజ్రాల నగరంపై వైమానిక దాడికి పాల్పడ్డ మయన్మార్ సైన్యం
Myanmar Military Airstrike
Balaraju Goud
|

Updated on: Aug 17, 2025 | 8:56 AM

Share

ఆగ్నేయాసియా దేశం మయన్మార్‌లోని లాభదాయకమైన రత్నాల తవ్వకాల పరిశ్రమకు కేంద్రమైన మోగోక్ పట్టణంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గర్భిణీ స్త్రీ, సాయుధ బృందం, స్థానిక నివాసితులు, మయన్మార్ ఆన్‌లైన్ మీడియాతో సహా కనీసం 21 మంది మరణించారు. గతంలో కూడా ఘోరమైన సైనిక వైమానిక దాడులు జరిగాయి. తరచుగా పౌరులు మరణించారు. ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ప్రారంభమైన అంతర్యుద్ధం మధ్య ప్రతిఘటన సమూహాల నుండి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఈ దాడులు తీవ్రతరం అయ్యాయి. యన్మార్ దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మండలేకు ఈశాన్యంగా 115 కి.మీ దూరంలో ఉన్న మొగోక్ టౌన్‌షిప్‌లోని ష్వేగు వార్డ్‌లో గురువారం రాత్రి 8:30 గంటలకు ఈ దాడి జరిగిందని టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA) ప్రతినిధి ల్వే యాయ్ ఊ తెలిపారు.

చైనా సరిహద్దు దగ్గర సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలీషియాలలో TNLA ఒకటి అని ల్వే యాయ్ ఊ అన్నారు. దాదాపు 21 మంది పౌరులు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇళ్ళు, బౌద్ధ ఆరామ భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఎగువ మండలే ప్రాంతంలోని రూబీ-మైనింగ్ కేంద్రమైన మోగోక్‌ను జూలై 2024లో TNLA స్వాధీనం చేసుకుంది. 2023 చివరిలో ప్రారంభమైన దాడిలో ఈశాన్య మయన్మార్‌లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్న మిలీషియాల కూటమిలో TNLA సభ్యులు.

మొగోక్‌లోని ష్వేగు వార్డులోని బౌద్ధ ఆశ్రమాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడి జరిగింది ఈ ఘటనలో మరణించిన బాధితుల్లో 16 మంది మహిళలు ఉన్నారని ఆ బృందం శుక్రవారం రాత్రి తన టెలిగ్రామ్ సోషల్ మీడియా ఛానెల్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. జెట్ ఫైటర్ బాంబులు వేయడంతో 15 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. మృతుల సంఖ్య దాదాపు 30కి పెరిగిందని మొగోక్ నివాసితులు ఇద్దరు శనివారం అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. అయితే మృతుల సంఖ్యను స్వతంత్రంగా నిర్ధారించలేమని, సైన్యం అరెస్టు చేస్తుందనే భయంతో పేరు చెప్పడానికి ఇష్టపడని నివాసితులు మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.

మయన్మార్ నౌ, డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా వంటి స్వతంత్ర ఆన్‌లైన్ మీడియా, వైమానిక దాడి తర్వాత శిథిలాల ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది. మోగోక్ సంఘటనపై సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో, సైన్యం చట్టబద్ధమైన యుద్ధ లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తుందని చెప్పింది. ప్రతిఘటన దళాలను ఉగ్రవాదులుగా ఆరోపించింది.

ఫిబ్రవరి 2021లో ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం నుండి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. శాంతియుత నిరసనలను ప్రాణాంతక శక్తితో అణిచివేసిన తర్వాత, సైనిక పాలనను వ్యతిరేకించే చాలా మంది ఆయుధాలు చేపట్టారు. దేశంలోని చాలా భాగం ఇప్పుడు ఘర్షణతో రగిలిపోతుంది. దశాబ్దాలుగా మరింత స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న సాయుధ ప్రజాస్వామ్య అనుకూల పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్, జాతి మిలీషియాలపై సైనిక ప్రభుత్వం వైమానిక దాడులను ముమ్మరం చేసింది. వైమానిక దాడులకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాలకు రక్షణ లేదు.

ఆగస్టు మొదటి రెండు వారాల్లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడుల్లో ఇద్దరు బౌద్ధ సన్యాసులు సహా 17 మంది మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని TNLA ప్రకటన తెలిపింది. స్వతంత్ర మయన్మార్ మీడియా నివేదికల ప్రకారం, గత సోమవారం, మధ్య మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి సమీపంలో జరిగిన భారీ పోరాటం కారణంగా రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కుల కాన్వాయ్‌పై జరిగిన వైమానిక దాడుల్లో దాదాపు 16 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది ట్రక్ డ్రైవర్లు.

ప్రతిపక్ష , స్వతంత్ర విశ్లేషకులు అంచనా ప్రకారం సైన్యం ఇప్పుడు దేశంలో సగం కంటే తక్కువ ప్రాంతాన్ని నియంత్రిస్తోంది. అయితే రాజధాని నేపిడాతో సహా మధ్య మయన్మార్‌లోని చాలా ప్రాంతాలపై అది గట్టి పట్టును కలిగి ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు ముందు, దానిని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రతిపక్ష దళాల నియంత్రణలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అది ఎదురుదాడిని ముమ్మరం చేసింది.

స్వతంత్ర మీడియా లేకపోవడం, సూకీ పార్టీ నాయకులు చాలా మందిని అరెస్టు చేయడం వల్ల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవని విమర్శకులు అంటున్నారు. సైనిక పాలనను చట్టబద్ధం చేయడానికి, పరిరక్షించడానికి ఈ ప్రణాళిక ఒక ప్రయత్నంగా విస్తృతంగా కనిపిస్తుంది. అనేక ప్రతిపక్ష గ్రూపులు ఎన్నికలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..