AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. వైన్‌షాప్‌లోకి ప్రవేశించి తుపాకులతో..

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు నిన్నరాత్రి భీభత్సం సృష్టించారు. తుపాకులతో బెదిరించి..

Telangana: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. వైన్‌షాప్‌లోకి ప్రవేశించి తుపాకులతో..
Gun Firing
Shaik Madar Saheb
|

Updated on: Jan 24, 2023 | 10:49 AM

Share

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు నిన్నరాత్రి భీభత్సం సృష్టించారు. తుపాకులతో బెదిరించి రూ.2 లక్షల దోపిడీ చేశారు దుండగులు. వైన్‌ షాప్‌ మూసివేసే సమయంలో వచ్చి, షాప్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు దోపిడీ దొంగలు. మేడ్చెల్ మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి దగ్గర జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వైన్స్ షాప్‌ని మూసివేస్తుండగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు షాప్‌ని మూసివేయొద్దంటూ అడ్డుతగిలారు. వారి చేతిలో ఉన్న డబ్బు బ్యాగ్‌ని లాక్కునేందుకు యత్నించారు. బ్యాగ్‌ ఇవ్వకపోవడంతో వారిపై పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాట జరుగుతుండగానే ఓ వ్యక్తి గన్ తీసి రెండు రౌండ్లు కాల్పులు చేసాడు. డబ్బు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. కాల్పులు జరపడంతో బ్యాగ్ ఇచ్చేసి, బైక్ వెనక తలదాచుకున్నామని బాధితులు టీవీ9తో గోడును వెళ్లబోసుకున్నారు.

ఎవ్వరూ గుర్తుబట్టకుండా ఉండేందుకు మంకీ క్యాప్‌తో వచ్చిన ముగ్గురు దుండగులు సీసీ కెమెరాకి చిక్కారు. బయట ఉన్న కెమెరాని ధ్వంసం చేసినా, కెమెరాలో చిక్కిన దుండగుల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..