AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ నియోజకవర్గ నాయకుల్లో మొదలైన కౌంటింగ్ టెన్షన్..

స్వల్ప విరామం తర్వాత పాలమూరు పాలిటిక్స్ మళ్లీ హిటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హీట్ కొనసాగగా పోలింగ్ అనంతరం లీడర్ల అంతా రిలాక్స్ మోడ్‎లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‎కు సమయం దగ్గర పడుతుండడంతో మరోమారు నేతల్లో అలజడి మొదలైంది. ఎంపీ ఎన్నికల ఫలితాల కంటే ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం రానుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.

Telangana: ఈ నియోజకవర్గ నాయకుల్లో మొదలైన కౌంటింగ్ టెన్షన్..
Brs Bjp Congress
Boorugu Shiva Kumar
| Edited By: Srikar T|

Updated on: May 31, 2024 | 3:45 PM

Share

స్వల్ప విరామం తర్వాత పాలమూరు పాలిటిక్స్ మళ్లీ హిటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హీట్ కొనసాగగా పోలింగ్ అనంతరం లీడర్ల అంతా రిలాక్స్ మోడ్‎లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‎కు సమయం దగ్గర పడుతుండడంతో మరోమారు నేతల్లో అలజడి మొదలైంది. ఎంపీ ఎన్నికల ఫలితాల కంటే ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం రానుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, అనంతరం ఒక్కరోజు తేడాతో ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. వరుస ఎన్నికలతో బీజీబీజీగా గడుపుతున్న నేతలకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత స్వల్ప విరామం దొరికింది. దీంతో కొద్ది రోజులు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రెస్ట్ మోడ్‎లోకి వెళ్లిపోయారు. ఇక కౌంటింగ్‎కు సమయం అసన్నం కావడంతో తిరిగి యాక్టివ్ మోడ్‎లోకి వస్తున్నారు. జూన్ 2వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, జూన్ 4వ తేదీన ఎంపీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అప్పటికే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫలితాల ప్రభావం ఎంపీ ఎన్నికలపై ఉంటుందన్న ఉద్దేశ్యంతో లెక్కింపును జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మెజారీటీ సభ్యులున్న బీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పనిచేసింది. దీంతో రెండు పార్టీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం కీలకం కానుంది.

పాలమూరు పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ..

ఇవి కూడా చదవండి

ఇక పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‎నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందరి కళ్లు జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్‎పై పడింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుమారు 8సార్లు పాలమూరు పర్యటనకు రావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రమే ప్రధానంగా ఈ ఎన్నికలో ఫోకస్ అయ్యారు. ఇక పోలింగ్ సరళిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయంపై ధీమాగా ఉన్నా.. కౌంటింగ్ రోజున ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...