Kishan Reddy: తెలంగాణకు మరో 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ కిషన్ రెడ్డి కీలక ట్వీట్..
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.. అయితే.. తెలంగాణలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.. అయితే.. తెలంగాణలో నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాలలో నాణ్యమైన ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందించడంలో ఈ నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బుధవారం ప్రకటన విడుదల చేశారు.
‘‘11 ఏళ్లుగా తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం కానున్నాయి. తెలంగాణలో విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ధన్యవాదములు’’.. అంటూ కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.
తెలంగాణకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్)
2. ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం)
3. జగిత్యాల జిల్లా – జగిత్యాల రూరల్ మండలం – చెల్గల్
4. వనపర్తి జిల్లా- నాగవరం శివారు
11 ఏళ్లుగా తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా.. మరో 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేటాయించింది. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందించడంలో కీలకం… pic.twitter.com/n1LckrhcpR
— G Kishan Reddy (@kishanreddybjp) October 1, 2025
ఇవి కాకుండా, గత రెండేళ్లలోనే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు.. రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పీఎంశ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషం. ఇది కాకుండా.. సమగ్రశిక్షా అభియాన్ కింద గత రెండేళ్లలో.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం.. దాదాపు రూ.2వేల కోట్లను కేటాయించింది. దాదాపు వెయ్యికోట్లతో.. ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి పూర్తి మద్దతు అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




