AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎లో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3 రోజులపాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మేజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఎలిమినేట్‌ కావడంతో మల్లన్నను విజయం వరించింది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. మూడు రోజులపాటు కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎లో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..
Mallanna
Srikar T
|

Updated on: Jun 08, 2024 | 6:27 AM

Share

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3 రోజులపాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మేజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఎలిమినేట్‌ కావడంతో మల్లన్నను విజయం వరించింది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. మూడు రోజులపాటు కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉపఎన్నిక బరిలో నిలిచారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల ఓట్లు ఉండగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్‌ఎస్‌ రాకేష్‌రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే ఇందులో అభ్యర్థులు ఎవరూ గెలుపు కోటాను చేరుకోలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులో మల్లన్న, రాకేష్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తర్వాత మల్లన్నకు లక్షా 46వేల 366 ఓట్లు రాగా, రాకేష్‌రెడ్డికి లక్షా 31వేల 674 ఓట్లు వచ్చాయి. దాంతో మేజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న చేరువయ్యాడు. రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాకేష్‌రెడ్డిని కూడా ఎలిమినేట్‌ చేయడంతో మల్లన్న విజయం ఖరారైంది.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తన విజయానికి కృషిచేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికంగా ఓడిపోయినా.. నైతికంగా తానూ గెలిచానంటున్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి. మొత్తానికి ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపు అమరవీరులకు అంకితమన్నారు మల్లన్న.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి