Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు.

Telangana: త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!  సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
CM Revanth Reddy
Follow us
Prabhakar M

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 07, 2025 | 9:20 AM

తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో కీలకమైన అడుగులు వేయబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ, దేశంలోని అత్యంత ఆధునిక స్థాయిలో లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన భారీ స్టేడియాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్‌సిటీలో లేదా మరో ప్రాంతంలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

విభిన్న మైదానాలు, ఆధునిక సదుపాయాలు

ఈ స్టేడియంలో అత్యాధునిక సాంకేతికతతో క్రికెట్, ఫుట్‌బాల్ వంటి వివిధ క్రీడలకు అనువైన మైదానాలను రూపొందిస్తారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణను క్రీడల కేంద్రంగా మార్చాలన్నది సీఎం రేవంత్ రెడ్డి దృష్టి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో అతిపెద్ద క్రీడా మైదానం

ప్రస్తుతం గుజరాత్‌లోని మోతేరా స్టేడియం దేశంలోనే అతిపెద్దది, 1.32 లక్షల మంది సామర్థ్యంతో ఉంది. తెలంగాణలో నిర్మించబోయే ఈ కొత్త స్టేడియం గుజరాత్ స్థాయికి తగ్గదిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మైదానం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు, ఐపీఎల్ మ్యాచ్‌లకు కేంద్రంగా మారుతుందని అంచనా.

ఆస్ట్రేలియా, సింగపూర్ పర్యటనల ప్రాధాన్యత

క్రీడాభివృద్ధిపై మరింత అవగాహన పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. అక్కడి క్రీడా మైదానాలు, శిక్షణా విధానాలు, ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు.

క్రీడారంగంలో తెలంగాణకు కొత్త ఒరవడి

తెలంగాణలో ఇప్పటికే 760 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర క్రీడారంగానికి దిశానిర్దేశం చేయనుంది. క్రీడలకు సంబంధించిన ప్రణాళికలు, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, సమగ్ర విధానం అమలులోకి తెచ్చే యోచనలో ఉంది.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు

20-24 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులపై కూడా చర్చించనున్నారు.

తెలంగాణ క్రీడా రంగానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన ఈ స్టేడియం, రాష్ట్రాన్ని క్రీడా భవిష్యత్తు కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.