Telangana: ఈ జిల్లాలో పంతం నెగ్గిన మంత్రి.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. బీఆర్ఎస్లో తగ్గిన జోష్..
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో 10 కి కాంగ్రెస్ 8, సీపీఐ 1, బి ఆర్ ఎస్ 1 గెలుచుకున్నాయి. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్కి దగ్గరగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ గూటికి చేయడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో 10 కి కాంగ్రెస్ 8, సీపీఐ 1, బి ఆర్ ఎస్ 1 గెలుచుకున్నాయి. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్కి దగ్గరగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ గూటికి చేయడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఒక్క బిఆర్ఎస్ లీడర్ను అసెంబ్లీ గేట్ తాకనీయనని మంత్రి పొంగులేటి చేసిన శపథం నేర వేరింది. ఓటమి తర్వాత ముఖ్య నేతలు బయటకు రావడం లేదు. జిల్లాలో అసలు బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.
భద్రాచలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు విజయం సాధించారు. జిల్లాలో బిఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. వాస్తవానికి తెల్లం వెంకటరావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. పొంగులేటితో పాటే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత భద్రాచలం టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకి ఇవ్వడంతో బిఆర్ఎస్లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. స్వల్ప మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు తెల్లం వెంకటరావు. పలితాలు తర్వాత కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా.. అప్పట్లో తెల్లం వెంకటరావు ఆ ప్రచారాన్ని ఖండించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ను కలిశారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభోత్సవం, అదే రోజు మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో తెల్లం వెంకటరావు పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. బిఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ సమావేశాలు, సభలకు హాజరవుతూ వచ్చారు. అయితే ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో మంత్రి పొంగులేటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకున్నది సాధించారు అని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ కాక రేపాయి. రాష్ట్రంలోనే అధికార బిఆర్ఎస్లో ఉంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. కేసిఆర్తోపాటు ఇతర నేతలపై విమర్శలు సంధించారు పొంగులేటి. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ కాక పుట్టించారు. తనకు బిఆర్ఎస్ చేసిన అవమానం, ఇబ్బందులు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళారు. బిఆర్ఎస్ ప్రభుత్వంను ఓడించి.. కెసిఆర్ను గద్దె దించడమే తన లక్ష్యం అని గట్టిగా సవాల్ చేశారు.
క్రమ క్రమంగా రాష్ట్రంలో ఇతర అసంతృప్త నేతల్ని కలుపు కొని కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్లు తమ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. చివరకు తన అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు పొంగులేటి. ఆ తర్వాత మరి కొందరు నేతలను కాంగ్రెస్లోకి తీసుకు వచ్చి.. కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్కు ఊపు తీసుకు వచ్చి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి.. పకడ్బందీ వ్యూహం, ప్రణాళికతో జిల్లాలో కాంగ్రెస్కు తిరుగులేని విజయానికి అందించారు. ఒక విధంగా గెలిచిన ఎమ్మెల్యేలకు వేలల్లో మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ఖమ్మం జిల్లా క్రియాశీల పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, రెవిన్యూ మంత్రిగా పొంగులేటి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలకు పదవులు ఇచ్చి జిల్లాకు సముచిత ప్రాధాన్యత కల్పించారు.
బిఆర్ఎస్ ఓటమి తర్వాత ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ నేతలు,కేడర్ డీలా పడ్డారు. ఓటమి తరవాత మాజీలు ఒకరిద్దరు మినహా మిగిలిన నేతలు మొహం చాటేశారు. పార్టీ తరపున ఏదైనా కార్యక్రమాలు ఇచ్చినా చేసే వారు కరువయ్యారు. పట్టుమని పదిమందితో కూడా నిరసన కార్యక్రమాలు చేయలేని స్థితిలో పడ్డారు. కేడర్కు ధైర్యం చెప్పి.. అండగా ఉండే నేతలే లేరు. ఉన్న నేతల్లో కొందరు పార్టీ మారతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే జంప్ అయ్యారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. కేవలం వంద రోజుల్లోనే ఇలా అయ్యింది ఏంటని.. అధికారంలో ఉన్నపుడు కేడర్ను పట్టించుకోలేదని.. ఈ పరిస్థితికి నేతలే కారణం అని బిఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నేటితో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ను ఖాళీ చేసి తన శపథం నెగ్గించుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…