AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో కలకలం… సమాధి తవ్వి మహిళ పుర్రె ఎత్తుకెళ్లారు..

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.  సమాధిని తవ్వి మహిళ పుర్రెను దొంగిలించారు.

Telangana: ఆ గ్రామంలో కలకలం... సమాధి తవ్వి మహిళ పుర్రె ఎత్తుకెళ్లారు..
Grave
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2022 | 3:39 PM

Share

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.  సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మృతి చెందగా… వారి గ్రామ శివారులో గల పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6 గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సమాధి తవ్వి కాళ్లు, చేతులు, తల, పుర్రె ఎముకలను ఎత్తుకెళ్లారు. గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. సమాధి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కారంపొడి చల్లి వెళ్లారు దుండగులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే క్షుద్రపూజల కోసం మహిళ ఎముకలను ఎత్తుకెళ్లారా..? లేదా మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కాగా ఈ ఇన్సిడెంట్‌‌‌‌‌‌ గురించి తెలిసి.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..

 రోడ్డు ప్రమాదంలో అన్న స్పాట్ డెడ్.. చూసేందుకు వెళ్తూ తమ్ముడు కూడా…