AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు.

తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం
Telangana Bjp
Srikar T
|

Updated on: May 06, 2024 | 9:52 AM

Share

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు. కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ సీఎంలతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.

ఇవాళ పెద్దపల్లిలో పర్యటించనున్నారు జేపీ నడ్డా. 10 గంటలకు భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటప్పల్‌ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ్నుంచి నేరుగా నల్గొండ వెళ్లి.. మూడు గంటలకు జరబోయే బహిరంగ సభలో పాల్గొంటారు నడ్డా. అలాగే ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ కూడా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 10 గంటలకు ముషీరాబాద్‌లోని యువసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్‌ పరిధిలోని నర్సంపేటలో బీజేపీ నిర్వహించే సభకు ఆయన హాజరై ప్రసంగిస్తారు. మరోవైపు రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ శర్మ సైతం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని ప్రవాసి సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ పరిధిలోని జమ్మికుంటలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అన్నామలై. ఇక సాయంత్రం సికింద్రాబాద్‌లో పరిధిలోని సనత్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి బైక్‌ ర్యాలీలో పాల్గొంటారు అన్నామలై. మొత్తంగా.. అత్యధిక పార్లమెంట్‌ స్థానాలే లక్ష్యంగా తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..