‘తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం’.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సిర్ఫూర్ కాగజ్ నగర్లో బీజేపీ జనసభలో కాంగ్రెస్‎పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని.. మోదీ 100 సీట్లలో గెలిచారని చెబుతూ సెంచరీ కొట్టేశారన్నారు. మూడో దశ పోలింగ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు.

'తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం'.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా

|

Updated on: May 05, 2024 | 7:49 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సిర్ఫూర్ కాగజ్ నగర్లో బీజేపీ జనసభలో కాంగ్రెస్‎పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని.. మోదీ 100 సీట్లలో గెలిచారని చెబుతూ సెంచరీ కొట్టేశారన్నారు. మూడో దశ పోలింగ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలకు గాను 10 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య పోటీ జరుగుతోందన్నారు.

ఓవైపు మోదీ, మరోవైపు రాహుల్ ఉన్నారన్నారు. మోదీ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని తెలిపారు. సెలవులు వచ్చాయంటే రాహుల్ బ్యాంకాక్ లో సేదతీరుతారని సెటైర్లు వేశారు. ఈ పదేళ్లలో అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించామని చెప్పారు. 70 ఏళ్ళపాటు కాంగ్రెస్ కాలయాపన చేసిందని విమర్శించారు. బాల రాముడి మందిర ప్రారంభోత్సవానికి ఖర్గే, రాహుల్ లను ఆహ్వానించామని కానీ వారు హాజరుకాలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వం అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ముస్లీం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఆ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. తనపై తెలంగాణ సీఎం ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us
Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం