AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse 2022: ఈ నెలలో సూర్యగ్రహణం.. భారతదేశంలో కనిపిస్తుందా..?

ఈ సంవత్సరంలో చివరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న కనిపించనుంది. ఈ సూర్యగ్రహణం దీపావళి రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణం ఐరోపా, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా..

Solar Eclipse 2022: ఈ నెలలో సూర్యగ్రహణం.. భారతదేశంలో కనిపిస్తుందా..?
Solar Eclipse 2022
Subhash Goud
|

Updated on: Oct 09, 2022 | 1:37 PM

Share

ఈ సంవత్సరంలో చివరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న కనిపించనుంది. ఈ సూర్యగ్రహణం దీపావళి రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణం ఐరోపా, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలోని ఈశాన్య భాగంలో కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 25 సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.42 గంటలకు ముగుస్తుంది. భారతదేశంతోపాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది.

సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం తర్వాత సూతకం ముగుస్తుంది. సూతకం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకపోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడా ప్రభావం చూపుతుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్య దేవుడు తులారాశిలో ఉంటాడు. దీని వల్ల తులారాశి వారిపై చెడు ప్రభావం చూపుతుందని జ్యోతిష నిపుణులు వివరిస్తున్నారు. తులారాశికి సూర్యగ్రహణం సమయం అనుకూలంగా లేదు. సూర్యగ్రహణం కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుంది. చంద్రుని నీడ కేంద్రం భూమిని కోల్పోయినప్పుడు భూమి ధ్రువ ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. timeanddate.com వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పాక్షిక సూర్యగ్రహణం న్యూఢిల్లీలో కనిపిస్తుంది. సంపూర్ణ గ్రహణం సమయంలో సూర్యుని డిస్క్ పూర్తిగా చంద్రునిచే అస్పష్టంగా ఉంటుంది. అయితే పాక్షిక, వార్షిక గ్రహణాలలో సూర్యునిలో కొంత భాగం మాత్రమే అస్పష్టంగా ఉంటుంది.

సూర్యగ్రహణంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని ప్రజలు సాధారణంగా గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరు. అలాగే గ్రహణ దుష్ఫలితాలను నివారించడానికి దర్భ గడ్డి లేదా తులసి ఆకులను నీటిలో వేస్తారు. గ్రహణం తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలని చాలా మంది నమ్ముతారు. సూర్య భగవానుడికి అంకితమైన మంత్రాలను పఠించడం దేశంలోని అనేక ఇళ్లలో అనుసరించే మరొక పద్ధతి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి సంతాన గోపాల మంత్రాన్ని జపించాలని పెద్దలు సలహా ఇస్తారు. చాలామంది గ్రహణ సమయంలో నీరు కూడా తాగరు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి