Reliance Intelligence: అంబానీ మరో కొత్త కంపెనీ.. భారతదేశ AI ఇంజిన్గా రిలయన్స్ ఇంటెలిజెన్స్!
Reliance Intelligence: రిలయన్స్ ఇప్పటికే మెటా, గూగుల్ వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రకటించింది. మెటాతో జాయింట్ వెంచర్లో రిలయన్స్ 70% వాటాను కలిగి ఉంది. ఈ భాగస్వామ్యాలు రిలయన్స్ AI డేటా సెంటర్లకు ఎంతో సహాయపడతాయి. భారతదేశంలోని సామాన్యుడికి AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే..

Reliance Intelligence: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీనిలో భాగంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్’ అనే కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనలకు ఇది కొనసాగింపు.
ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్ టాటా 83 ఏళ్ల వయస్సులో ఒంటరిగా 150 కి.మీ ప్రయాణం.. ఎందుకో తెలిస్తే అవాక్కవాల్సిందే!
రిలయన్స్ AI ప్రాజెక్టులు
ఇవి కూడా చదవండి
- డేటా సెంటర్లు: దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున AI డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తిగా గ్రీన్ ఎనర్జీపై నడుస్తాయి. ఇవి భారతదేశ AI అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది.
- నాలుగు కీలక లక్ష్యాలు: కొత్త సంస్థ ప్రధాన లక్ష్యాలు తదుపరి తరం AI మౌలిక సదుపాయాలను నిర్మించడం, ప్రపంచ భాగస్వామ్యాలను సురక్షితం చేయడం, భారతదేశానికి అనుగుణంగా AI సేవలను సృష్టించడం, AI రంగంలో ప్రతిభను పెంపొందించడం.
- సామాన్యుడి కోసం AI : భారతదేశంలోని సామాన్యుడికి AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే అంబానీ ప్రధాన కల. ఇది దేశ సాంకేతిక రంగంలో ఒక పెద్ద ముందడుగుకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు.
- వ్యూహాత్మక భాగస్వామ్యాలు: రిలయన్స్ ఇప్పటికే మెటా, గూగుల్ వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రకటించింది. మెటాతో జాయింట్ వెంచర్లో రిలయన్స్ 70% వాటాను కలిగి ఉంది. ఈ భాగస్వామ్యాలు రిలయన్స్ AI డేటా సెంటర్లకు ఎంతో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: Multibagger Stock: ఐదేళ్ల కిందట షేర్ ధర 1 రూపాయి.. ఇప్పుడు రూ.98.. బంపర్ రిటర్న్!
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








