AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ నుంచి తెలుగు తేజం ఔట్.. కారణం ఏంటంటే?

World Badminton Championship: పీవీ సింధు 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారతదేశం నుంచి మొదటి క్రీడాకారిణిగా నిలిచింది.

PV Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ నుంచి తెలుగు తేజం ఔట్.. కారణం ఏంటంటే?
Cwg 2022, Pv Sindhu
Venkata Chari
|

Updated on: Aug 14, 2022 | 5:29 AM

Share

World Badminton Championship: కామన్వెల్త్ గేమ్స్ 2022 (CWG 2022)లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దేశానికి చిరస్మరణీయమైన బంగారు పతకాన్ని అందించింది. సీడబ్ల్యూజీ మహిళల సింగిల్స్‌లో సింధు తొలిసారి బంగారు పతకం సాధించింది. సింధు కూడా ఈ బంగారు పతకం కోసం చిన్న చిన్న సమస్యను భరించింది. కానీ, వాటికి ఆమె ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. స్వర్ణం గెలుచుకునే ప్రయత్నంలో సింధు గాయం ఉన్నప్పటికీ ఫైనల్ ఆడింది. ఇప్పుడు ఈ గాయం తీవ్రంగా మారింది. దీని కారణంగా ఆమె ఈ నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడడం లేదని తెలుస్తోంది.

గాయపడినప్పటికీ స్వర్ణం సాధించిన తెలుగు తేజం..

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ జపాన్ రాజధాని టోక్యోలో ఆగస్టు 22 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. మాజీ మహిళల సింగిల్స్ ఛాంపియన్ సింధు ఈ గేమ్స్‌లో ఆడడం లేదు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సింధు గాయపడింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సింధుకు ఈ గాయం తగిలింది. అయినప్పటికీ, ఆమె కఠినమైన మ్యాచ్‌లో గెలిచి, ఆపై ఆగస్టు 8న జరిగిన ఫైనల్‌లో, గాయం కారణంగా బాధను తట్టుకుని, తనకు, దేశానికి చిరస్మరణీయమైన స్వర్ణాన్ని అందించింది.

ఇవి కూడా చదవండి

సింధు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు పూర్తిగా కోలుకోలేకపోతుందని స్పోర్ట్‌స్టార్ నివేదిక పేర్కొంది. భారత స్టార్ షట్లర్ తండ్రి పీవీ రామన్న మాట్లాడుతూ, సింధు ఎడమ చీలమండలో ఒత్తిడితో ఫ్రాక్చర్ అయినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నాడు. దీంతో ఆమె నెల రోజులకు పైగా కోర్టుకు దూరంగా ఉండనుందని తెలిపాడు. ప్రస్తుతం విశ్రాంతి, కోలుకోవడంపై దృష్టి సారించిందని, అక్టోబర్‌లో సింధు తిరిగి కోర్టుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆమె తండ్రి తెలిపారు.

సైనా నెహ్వాల్‌పైనే ఆశలన్నీ..

ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన భారత క్రీడాకారిణి సింధు నిలిచింది. 2019లో సింధు మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. భారతదేశం నుంచి అలా చేసిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. 2013 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న సింధు ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు సాధించింది. రెండుసార్లు రజతం, రెండుసార్లు కాంస్యం కూడా సాధించింది. సింధుకు ఈసారి తొలి రౌండ్‌లోనే బై లభించింది. ప్రస్తుతం ఆమె గైర్హాజరీతో వెటరన్‌ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పైనే దృష్టి నెలకొంది. సైనాతో పాటు యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్ కూడా మహిళల సింగిల్స్‌లో క్లెయిమ్ చేయనున్నారు.