AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2023: ఎట్టకేలకు వీసాలు పొందిన పాకిస్తాన్ జట్టు.. హైదరాబాద్‌కు ఎప్పుడు రానుందంటే?

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరికొద్దిరోజుల సమయం ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మధ్య వార్ మొదలైంది. వీసా సమస్యపై పీసీబీ ఐసీసీకి లేఖ రాసి బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబరు 27న పాకిస్థాన్ తన తొలి వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, భారత్‌కు రాలేకపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎట్టకేలకు వీసా వచ్చింది.

ODI World Cup 2023: ఎట్టకేలకు వీసాలు పొందిన పాకిస్తాన్ జట్టు.. హైదరాబాద్‌కు ఎప్పుడు రానుందంటే?
Pakistan Cricket Team
Venkata Chari
|

Updated on: Sep 26, 2023 | 5:45 AM

Share

ODI World Cup 2023: క్రికెట్ ప్రపంచ కప్ భారతదేశంలో ప్రారంభం కానుంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఇంతలో పాకిస్తాన్ జట్టు భారతదేశానికి రావడానికి అనుమతి పొందింది. పాక్ జట్టుకు భారత ప్రభుత్వం వీసా ఇచ్చినట్లు ICC ధృవీకరించింది. వీసా రాకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం నాడు ఐసీసీకి అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ వార్త వచ్చింది.

పాకిస్తాన్ తన మొదటి వార్మప్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 29న ఆడాలి. అంతకు ముందు జట్టు సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకోవాలి. అయితే, ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు, దాని సహాయక సిబ్బంది వీసా పొందలేకపోయారు. అయితే సోమవారం సాయంత్రం వీసాకు అనుమతి లభించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి ఒమర్ ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచకప్‌నకు వీసాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై బోర్డు ఐసీసీకి లేఖ రాసి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

అతి పెద్ద టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లాల్సిన సమయంలో పాక్ జట్టు ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం చాలా బాధాకరమని పీసీబీ ఈ ప్రకటనలో పేర్కొంది. వార్మప్ మ్యాచ్‌కు ముందు మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చిందని, ఎందుకంటే ఆటగాళ్లకు భారత్‌కు వెళ్లడానికి ఇంకా అనుమతి రాలేదని పీసీబీ తెలిపింది.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మొదట కొన్ని రోజులు దుబాయ్‌లో ఉండి, ఆపై భారతదేశానికి బయలుదేరాల్సి ఉంది. కానీ, భారతదేశం నుంచి వీసా రాకపోవడంతో, పాకిస్తాన్ తన టీమ్ బాండింగ్ ప్లాన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మొత్తం ప్లాన్‌ను మళ్లీ తయారు చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ తన రెండు వార్మప్ మ్యాచ్‌లు, రెండు ఓపెనింగ్ లీగ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో మాత్రమే ఆడాల్సి ఉంది. కాబట్టి, ఇప్పుడు జట్టు నేరుగా ఇక్కడకు రానుంది.

ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ షెడ్యూల్..

29 సెప్టెంబర్ vs న్యూజిలాండ్ (వార్మ్ అప్ మ్యాచ్)

3 అక్టోబర్ vs ఆస్ట్రేలియా (వార్మ్ అప్ మ్యాచ్)

6 అక్టోబర్ vs నెదర్లాండ్స్

10 అక్టోబర్ vs శ్రీలంక

14 అక్టోబర్ vs భారతదేశం

20 అక్టోబర్ vs ఆస్ట్రేలియా

23 అక్టోబర్ vs ఆఫ్ఘనిస్తాన్

27 అక్టోబర్ vs సౌత్ ఆఫ్రికా

31 అక్టోబర్ vs బంగ్లాదేశ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..