AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH IPL Auction 2025: కావ్యా పాపకు ఏమైంది? స్టార్ ప్లేయర్లను పట్టించుకోని సన్ రైజర్స్.. ఫుల్ టీమ్ ఇదిగో

Sunrisers Hyderabad IPL Auction Players : ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ప్రణాళికలు అంతు చిక్కడం లేదు. ఆ జట్టు ఇప్పటివరకు ఎక్కువగా అన్ క్యాప్డ్ ప్లేయర్లనే కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ ఎంతమందిని కొనుగోలు చేసిందో, పూర్తి జట్టు ఎలా ఉందో ఒక లుక్కేద్దాం రండి.

SRH IPL Auction 2025: కావ్యా పాపకు ఏమైంది? స్టార్ ప్లేయర్లను పట్టించుకోని సన్ రైజర్స్.. ఫుల్ టీమ్ ఇదిగో
SRH IPL Auction
Basha Shek
| Edited By: Venkata Chari|

Updated on: Nov 26, 2024 | 11:58 AM

Share

గత ఐపీఎల్‌ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ దాకా వచ్చింది. అయితే అక్కడ పాట్ కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. అందుకే రాబోయే ఐపీఎల్‌లో హైదరాబాద్‌ కొత్త ప్లాన్‌తో ముందుకెళ్లాలని భావించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు విదేశీ క్రికెటర్లను హైదరాబాద్‌ రిటైన్ చేసుకుంది. అలాగే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి టీమిండియా క్రికెటర్లను మాత్రమే అంటి పెట్టుకుంది. ఇక సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న మెగా వేలంలో పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది ఆరెంజ్ ఆర్మీ. 2016 ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది మెగా వేలానికి ముందు 5 మంది క్రికెటర్లను తన వద్ద ఉంచుకుంది. 45 కోట్ల రూపాయలకు హైదరాబాద్ జట్టులోని ఆటగాళ్లను తీసుకునేందుకు మెగా వేలానికి వెళ్లింది. కబ్యా మారన్ జట్టు ఒక క్రికెటర్ కోసం RTMని ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. మెగా వేలానికి ముందు సంజూ జట్టులో మొత్తం 20 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 5 మంది విదేశీ క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది.

25వ ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న క్రికెటర్లు..

  • హెన్రిచ్ క్లాసెన్ – 23 కోట్లు
  • పాట్ కమిన్స్ – 18 కోట్లు
  • అభిషేక్ శర్మ – 14 కోట్లు
  • ట్రావిస్ హెడ్ – 14 కోట్లు
  • నితీష్ కుమార్ రెడ్డి – 6 కోట్లు

జెడ్డాలో జరుగుతోన్న IPL మెగా వేలంలో ఆరెంజ్ ఆర్మీ ఇప్పటవరకు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా

మహ్మద్ షమీ (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. రూ. 3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), అథర్వ తైదే (రూ. 30 లక్షలు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), జీషన్ అన్సారీ (రూ. 40 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1 కోటి), బ్రైడన్ కార్సే (రూ. 1 కోటి), కమిందు మెండిస్ (రూ. 75 లక్షలు), అనికేత్ వర్మ (రూ. 30) లక్ష), ఎషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు).

ఇవి కూడా చదవండి

సన్ రైజర్స్ వద్ద ఎంత పర్స్ మనీ ఉందంటే?

  • ఎస్ ఆర్ హెచ్ వద్ద ఉన్న పర్స్ మనీ : రూ. 20 లక్షలు.
  • RTM కార్డ్‌లు: 1
  • ప్లేయర్ స్లాట్స్: 5
  • విదేశీ ప్లేయర్ల స్లాట్స్: 1

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..