AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ తేదీలు, వేదికలను BCCIతో చర్చించి ఆమోదించినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సెప్టెంబర్‌లో టీమిండియా అభిమానులకు మరోసారి టీ20 క్రికెట్ సందడి మొదలుకానుంది.

IND vs AFG: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
Ind Vs Afg T20
Rakesh
|

Updated on: Aug 11, 2026 | 7:44 PM

Share

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మరో ఆసక్తికరమైన సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2026లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) స్పష్టం చేసింది. ఇటీవలే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో మరోసారి ఇరు జట్లు పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది.

ఢిల్లీలోనే మూడు టీ20 మ్యాచ్‌లు

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగస్టు 10న తమ వాటాదారులకు పంపిన లేఖలో ఈ తేదీలను వెల్లడించింది. ఈ సిరీస్‌కు సంబంధించిన తేదీలు, వేదికలపై బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, రెండు బోర్డులు దీనికి అంగీకరించాయని ACB తెలిపింది. అంటే సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌లు కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు.

ACB సీఈఓ నసీబ్ ఖాన్ ఏం చెప్పారు?

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ ఈ సిరీస్‌పై తమ కమర్షియల్ పార్టనర్లకు పంపిన లేఖలో స్పష్టత ఇచ్చారు. 2026లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్ పర్యటన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సిరీస్ తేదీలు, మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, వాటికి ఆమోదం లభించిందని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు.

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు

మూడు టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. సాధారణ ప్రజల కోసం ఇరు బోర్డుల నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని ACB తెలిపింది. అయితే తమ వాటాదారులకు, కమర్షియల్ భాగస్వాములకు పంపిన లేఖను సిరీస్‌కు సంబంధించిన అధికారిక నిర్ధారణగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ ఆధారంగా మీడియా హక్కులు కలిగిన సంస్థలు, కమర్షియల్ పార్టనర్లు తమ ప్రసార ఏర్పాట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ముందస్తు పనులను ప్రారంభించవచ్చని ACB సూచించింది.

సెప్టెంబర్‌లో టీమిండియా-అఫ్గాన్ పోరు

మొత్తంగా సెప్టెంబర్ 13 నుంచి భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. టెస్ట్, వన్డే సిరీస్‌ల తర్వాత ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు ఎలా ఆడతాయనేది ఆసక్తికరంగా మారింది. టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌తో పాటు దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచింది. మరోవైపు టీమిండియాకు కూడా టీ20 ఫార్మాట్‌లో ఎంతో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరగబోయే ఈ మూడు మ్యాచ్‌లు అభిమానులకు మంచి క్రికెట్ వినోదాన్ని అందించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us