AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: మారిన ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌.. రోహిత్ సేనకు భారీ ప్రయోజనం.. ఎలాగో తెలుసా?

India vs Netherlands: మ్యాచ్ రీషెడ్యూల్ కారణంగా టీమ్ ఇండియా లాభపడింది. నిజానికి భారత జట్టు నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందుగా నవంబర్ 11న జరగాల్సి ఉంది. ఇప్పుడు నవంబర్ 12న జరగనుంది. ఈ మ్యాచ్ తేదీని మార్చడం టీమ్ ఇండియాకు సహాయపడుతుంది. టోర్నీలో ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌. ఇటువంటి పరిస్థితిలో సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు జట్లూ ఏమి చేయాలో తెలుసుకుంటాయి.

Team India: మారిన ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌.. రోహిత్ సేనకు భారీ ప్రయోజనం.. ఎలాగో తెలుసా?
Team India
Venkata Chari
|

Updated on: Aug 12, 2023 | 6:42 AM

Share

World Cup 2023: ప్రపంచ కప్ 2023 సవరించిన షెడ్యూల్ ఇటీవలే ప్రకటించారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లతో సహా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీని మార్చారు. భారత్-పాకిస్థాన్ హైవోల్టేజీ మ్యాచ్ ఇప్పుడు 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనుంది. కాగా భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ కూడా ఒకరోజు ముందుగానే మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చడం వల్ల టీమ్ ఇండియా కూడా లాభపడబోతోంది. ఆగస్టు 9న ఐసీసీ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 9 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు భారత్‌కు చెందినవి ఉన్నాయి.

టోర్నమెంట్‌లో పాల్గొనే కొన్ని దేశాల బోర్డులు, ఆతిథ్య నగరానికి చెందిన స్థానిక పోలీసుల అభ్యర్థన మేరకు ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. నిజానికి, ఆతిథ్య నగరంలో పోలీసులు భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 9 మ్యాచ్‌ల తేదీలను మార్చారు. వేదిక మునుపటిలానే ఉంటుంది. కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకటి లేదా రెండు రోజుల ముందు మార్చారు. కొన్ని 1 లేదా 2 రోజులు ముందుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్..

మ్యాచ్ రీషెడ్యూల్ కారణంగా టీమ్ ఇండియా లాభపడింది. నిజానికి భారత జట్టు నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందుగా నవంబర్ 11న జరగాల్సి ఉంది. ఇప్పుడు నవంబర్ 12న జరగనుంది. ఈ మ్యాచ్ తేదీని మార్చడం టీమ్ ఇండియాకు సహాయపడుతుంది. టోర్నీలో ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌. ఇటువంటి పరిస్థితిలో సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు జట్లూ ఏమి చేయాలో తెలుసుకుంటాయి.

నికర రన్‌రేట్ ముఖ్యం..

రెండు జట్లూ టేబుల్ మధ్యలో ఉండి, ఇరుజట్లకు మొదటి 4 స్థానాలకు చేరుకోవాలనే ఆశ ఉంటే, ఇటువంటి పరిస్థితిలో జట్టు మొదట ఎన్ని పరుగులు, ఎన్ని బంతుల తేడాతో గెలవాలి అనేది తెలుస్తుంది. తద్వారా నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవచ్చు. టోర్నీలో నెట్ రన్‌రేట్ కూడా చాలా ముఖ్యం. మునుపటి మూడు ఎడిషన్లలో, నెట్ రన్ రేట్ కారణంగా జట్లు కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. గత ప్రపంచ కప్‌లో, న్యూజిలాండ్, పాకిస్తాన్ రెండూ 11 పాయింట్లను కలిగి ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్‌రేట్ ప్రయోజనాన్ని పొందింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..