AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ఐర్లాండ్‌ టూర్‌కు ద్రవిడ్‌, లక్ష్మణ్‌ దూరం.. టీమిండియా కోచ్ బాధ్యతలు ఎవరికంటే?

జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్, మాజీ వెటరన్ బ్యాటర్‌ లక్ష్మణ్క కూడా ఈ పర్యటనకు వెళ్లడం లేదని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ ఒక నివేదికలో తెలిపింది. గతేడాది కూడా టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు ద్రవిడ్‌తో సహా సహాయక సిబ్బందికి విశ్రాంతి ఇచ్చారు. ఆ సమయంలో కోచ్‌గా లక్ష్మణ్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఈసారి కూడా అదే జరుగుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు లక్ష్మణ్ జట్టుతో ఉండడని వార్తలు వచ్చాయి

IND vs IRE: ఐర్లాండ్‌ టూర్‌కు ద్రవిడ్‌, లక్ష్మణ్‌ దూరం.. టీమిండియా కోచ్ బాధ్యతలు ఎవరికంటే?
India Vs Ireland Series
Basha Shek
|

Updated on: Aug 12, 2023 | 7:00 AM

Share

ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న భారత జట్టు, ఆ తర్వాత వెంటనే ఐర్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది, అయితే ఇందులో చాలా మంది ఆటగాళ్లు ప్రస్తుత జట్టుకు దూరంగా ఉంటున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ఆటగాళ్లే కాదు, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బంది కూడా వెళ్లరు. ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా నియమిస్తారని భావించినప్పటికీ, ఇప్పుడు అది కూడా జరిగేలా కనిపించడం లేదు. కాబట్టి  జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో, ప్రధాన కోచ్ లేకుండా భారత జట్టు ఈ పర్యటనలో ఆడాల్సి ఉంటుంది. జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్, మాజీ వెటరన్ బ్యాటర్‌ లక్ష్మణ్క కూడా ఈ పర్యటనకు వెళ్లడం లేదని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ ఒక నివేదికలో తెలిపింది. గతేడాది కూడా టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు ద్రవిడ్‌తో సహా సహాయక సిబ్బందికి విశ్రాంతి ఇచ్చారు. ఆ సమయంలో కోచ్‌గా లక్ష్మణ్ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఈసారి కూడా అదే జరుగుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు లక్ష్మణ్ జట్టుతో ఉండడని వార్తలు వచ్చాయి. అతని స్థానంలో, ఇతర ఎన్ సీఏ కోచ్‌లు, సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే మాత్రమే జట్టుతో ఉంటారు.

బుమ్రా రీఎంట్రీపైనే దృష్టి

ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లో భారత్‌కు అత్యంత ముఖ్యమైన విషయం జస్ప్రీత్ బుమ్రా. స్టార్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఏడాది తర్వాత క్రికెట్ ఫీల్డ్‌కి తిరిగి రావడమే కాకుండా, జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అతని కెప్టెన్సీ కంటే, అందరి దృష్టి అతని ఫిట్‌నెస్, బౌలింగ్‌పైనే ఉంటుంది, ఎందుకంటే ఆసియా కప్‌, ఆపై ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా విజయావకాశాలు బుమ్రా ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి.

కొత్త ఆటగాళ్లకు అవకాశం

ఈ పర్యటన కోసం టీమ్ ఇండియా ఆగస్టు 15న భారత్ నుంచి బయలుదేరి డబ్లిన్ చేరుకుంటుంది. కొంతమంది ఆటగాళ్ళు ఫ్లోరిడా నుండి ఇక్కడికి చేరుకుంటారు. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 18, 20, 23 తేదీల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌తో పాటు రింకూ సింగ్, జితేష్ శర్మ కూడా తొలిసారిగా టీమ్ ఇండియాలో ఆడే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్ సిరీస్ కోసం భారత జట్టు

జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఫేమస్ సింగ్, కృష్ణ, అర్ష్‌దీప్ ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..