ముంబై టీంలో చేరిన యార్కర్ కింగ్.. ఎంట్రీ మాములుగా లేదుగా.. ఆర్సీబీకి మొదలైన టెన్షన్..
Jasprit Bumrah: వెన్నునొప్పి శస్త్రచికిత్స తర్వాత, బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. అతని పునరాగమనంపై ఇంకా సస్పెన్స్ ఉందని ఇటీవలి నివేదిక పేర్కొంది. కానీ, ఇప్పుడు బుమ్రా ముంబై ఇండియన్స్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. మరి బుమ్రా ఏ జట్టుకు వ్యతిరేకంగా బరిలోకి దిగుతాడో చూడాలి.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో లేని జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. వెన్నునొప్పి కారణంగా ముంబై ఇండియన్స్ తొలి నాలుగు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. అతను ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతుంది. అంటే, ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బూమ్ బూమ్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. అందువల్ల, ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పడుతుందని అంతా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్ సామీ.. చూడలేక నిద్రలోకి జారుకున్న చెన్నై ఆటగాడు
ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. కాబట్టి, ఈ మ్యాచ్లో బెంగళూరుకు విజయం అనివార్యం. అయితే, జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులోకి ప్రవేశించడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం అనుకున్నంత సులభం కాదు. అందువల్ల, ఏప్రిల్ 7న జరగనున్న బెంగళూరు, ముంబై మ్యాచ్లో రెండు జట్ల నుంచి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు.
2013 నుంచి ముంబై ఇండియన్స్తో బుమ్రా..
𝑹𝑬𝑨𝑫𝒀 𝑻𝑶 𝑹𝑶𝑨𝑹 🦁#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/oXSPWg8MVa
— Mumbai Indians (@mipaltan) April 6, 2025
2013 నుంచి ముంబై పేస్ అటాక్కు జస్ప్రీత్ బుమ్రా బలంగా ఉన్నాడు. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున 133 మ్యాచ్లు ఆడి, 165 వికెట్లు పడగొట్టాడు. వెన్ను గాయం కారణంగా బుమ్రా ఐపీఎల్ 2023లో ఆడలేకపోయాడు.
సిడ్నీ టెస్ట్లో గాయం..
ఈ ఏడాది జనవరి 4న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా సిడ్నీ టెస్ట్ సందర్భంగా బుమ్రాకు గాయం అయింది. ఆ గాయం కారణంగా బుమ్రా కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇది టీం ఇండియాకు పెద్ద దెబ్బగా మారింది. బుమ్రా కూడా ఇదే గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు.
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రాను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడింది. వాటిలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




