
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లోనే మంచి క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీకి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఓనర్. రోహిత్ శర్మ నేతృత్వంలో ఈ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, పియూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా లాంటి ముంబై ప్లేయర్స్.. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున ఎన్నో మ్యాచ్లు ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియం.. ముంబై ఇండియన్స్ జట్టు హోం గ్రౌండ్. 2017లో, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలలో 100 మిలియన్ల డాలర్లు దాటిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. 2019లో ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ సుమారు 9,809 కోట్లు( అమెరికన్ కరెన్సీలో 115 మిలియన్ల డాలర్లు) అని అంచనా. ఈ ముంబై ఇండియన్స్ జట్టు శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనే హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
Video: 2005లో జహీర్కి ‘ఐ లవ్ యూ’ చెప్పిన అభిమాని.. కట్చేస్తే.. 20 ఏళ్ల తర్వాత ఊహించని సర్ప్రైజ్
Zaheer Khan Met Old Fan After 20 Years: ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కనిపించనున్నాడు. లక్నో జట్టు మెంటర్గా ఎంపికైన జాచ్ బౌలింగ్ కోచ్గా కూడా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే లక్నో జట్టులో చేరిన జహీర్ ఖాన్ వీడియో వైరల్గా మారింది.
- Venkata Chari
- Updated on: Mar 15, 2025
- 12:57 pm
Rohit Sharma: ఐపీఎల్ కి ముందు రిలాక్స్ మోడ్లోకి రోహిత్.. ఫ్యామిలీతో కలిసి ఏం చేస్తున్నాడో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తన భార్య, కుమార్తెతో కలిసి మాల్దీవుల్లో సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు. గట్టి షెడ్యూల్కు ముందు విశ్రాంతి తీసుకుంటూ, తన ఫ్యామిలీతో ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నాడు. రోహిత్ తన IPL 2025 ప్రదర్శనతో ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. త్వరలో భారత జట్టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తలపడనుంది.
- Narsimha
- Updated on: Mar 15, 2025
- 10:34 am
WPL 2025 Final: తొలి ట్రోఫీ కోసం ముంబైను ఢీ కొట్టనున్న ఢిల్లీ.. డబ్ల్యూపీఎల్ విజేతపై ఉత్కంఠ?
DC vs MI, WPL 2025 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్ మ్యాచ్ మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో ఫైనల్ పోరు. ఢిల్లీ క్యాపిటల్స్ మూడోసారి ఫైనల్కు చేరుకోగా, ముంబై ఇండియన్స్ రెండోసారి ఫైనల్కు చేరుకుంది.
- Venkata Chari
- Updated on: Mar 15, 2025
- 7:19 am
IPL 2025: అత్యంత ఖరీదైన ప్లేయింగ్ XI.. ఇది చాలా కాస్లీ గురూ!
IPL 2025 వేలంలో భారీగా బిడ్లు నమోదయ్యాయి. అత్యంత ఖరీదైన జట్టులో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 193.50 కోట్లతో అత్యంత ఖరీదైన ప్లేయింగ్ XI రూపొందించబడింది. ఈ జట్టు వచ్చే సీజన్లో IPLను ఓ ఊపు ఊపడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. జోస్ బట్లర్ (రూ. 15.75 కోట్లు) – విదేశీ ఆటగాడు, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల నిపుణుడు. అతని శక్తివంతమైన హిట్టింగ్, వేగవంతమైన ఇన్నింగ్స్ ఓపెనింగ్కు కీలకం. బట్లర్ మంచి ఫామ్లో ఉంటే, మ్యాచ్ను ఒక్కరే గెలిపించగలడు.
- Narsimha
- Updated on: Mar 14, 2025
- 11:39 am
IPL 2025: ధోని vs రోహిత్ మ్యాచ్ చూడాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే.. ఒక్కో టిక్కెట్ ధరెంతో తెలుసా?
IPL 2025 CSK vs MI Tickets: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, చెన్నై వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయి. వాటి ధర లక్షల్లో చేరుకుంది.
- Venkata Chari
- Updated on: Mar 13, 2025
- 7:38 am
IPL 2025: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ నుంచి రూ. 47 కోట్ల ప్లేయర్లు ఔట్?
5 Players May Miss the Beginning of IPL 2025 Season: ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కానీ, ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు తన స్టార్ ఆటగాళ్లలో ఒకరు లేకుండా ఆడాల్సి రావొచ్చు. ఇందుకోసం జట్టు రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది.
- Venkata Chari
- Updated on: Mar 12, 2025
- 7:58 am
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా కెరీర్ క్లోజ్.. టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగినట్లే..?
Jasprit Bumrah Injury: ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో బాధపడ్డాడు. దాని కారణంగా అతను ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు. తాజాగా, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు కూడా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
- Venkata Chari
- Updated on: Mar 12, 2025
- 7:19 am
IPL 2025: ముంబైకు బిగ్ షాక్.. హార్దిక్ పాండ్యపై నిషేధం.. కట్చేస్తే.. తొలి మ్యాచ్లో కెప్టెన్గా ఎవరంటే?
Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్ 2025కు రంగం సిద్ధమైంది. అయితే, ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి మ్యాచ్కు ముందే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం అమలులో ఉంది. దీంతో తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడం ఖాయమైంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడే మ్యాచ్లో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
- Venkata Chari
- Updated on: Mar 11, 2025
- 1:57 pm
IPL 2025: గాయపడిన దక్షిణాఫ్రికా పేసర్.. ముంబైలోకి కొత్త ఆల్ రౌండర్ ఎంట్రీ! మనోడి హిస్టరీ తెలుసా?
ముంబై ఇండియన్స్ జట్టులో గాయాల కారణంగా మార్పులు చోటు చేసుకున్నాయి. లిజాద్ విలియమ్స్ గాయంతో తప్పుకోగా, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ ఎంపికయ్యాడు. SA20లో అద్భుత ప్రదర్శన చేసిన బాష్, ఐపీఎల్లో తన తొలి అవకాశాన్ని అందుకున్నాడు. PSL 2025 ఒప్పందాన్ని వదులుకుని, ముంబై ఇండియన్స్ను ప్రాధాన్యతగా ఎంచుకున్నాడు.
- Narsimha
- Updated on: Mar 9, 2025
- 11:25 am
IPL 2025: రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ తమ హోమ్ మ్యాచ్ల కోసం IPL 2025 టికెట్ బుకింగ్ షెడ్యూల్ను ప్రకటించింది. వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ల టిక్కెట్లు మూడు దశల్లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 31న KKRతో మొదటి హోమ్ మ్యాచ్ ఆడనుంది. గత సీజన్లో నిరాశపరిచిన MI, ఈసారి కొత్త వ్యూహాలతో టైటిల్ గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది.
- Narsimha
- Updated on: Feb 28, 2025
- 9:41 am