AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

IND vs ENG Birmingham ODI: వరుస పరాజయాల గాయాల నుంచి కోలుకుని, ఇంగ్లాండ్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి టీం ఇండియా కసితో ఉంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో పటిష్టంగా కనిపిస్తున్న భారత్, తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. రేపటి సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి!

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!
Ind Vs Eng 1st Odi
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 7:18 AM

Share

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ తొలి వన్డే పోరు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి.

ప్రతీకార పోరుకు వేళాయే.. ర్యాంకింగ్స్ వేటలో భారత్..

ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడానికి టీం ఇండియాకు ఇది సువర్ణావకాశం. ప్రస్తుత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, భారత్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ గెలిస్తే ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి భారత్ పైచేయి సాధించే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీం ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

ఇవి కూడా చదవండి

సీనియర్ల రాకతో పెరిగిన బలం.. కళ్ళు చెదిరే వ్యూహాలు..

ఈ వన్డే సిరీస్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో, ఇప్పటి నుంచి ఆడే ప్రతి వన్డే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఇంగ్లాండ్‌లోని బౌన్స్ పిచ్‌లపై రాణిస్తే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సులువవుతుంది. ముఖ్యంగా టీ20ల్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌కు ఇబ్బంది పడిన భారత బ్యాటర్లకు, ఇప్పుడు బుమ్రా రాకతో బౌలింగ్ విభాగంలో కొండంత బలం చేకూరింది.

తొలి వన్డేలో బరిలోకి దిగే భారత తుది జట్టు (ప్లేయింగ్ XI) అంచనా:

బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత్ అత్యంత బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఫస్ట్ డౌన్‌లో ఎప్పటిలాగే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రానుండగా, నాల్గో స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌ను బలోపేతం చేయనున్నారు. ఐదు, ఆరు స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టుకు వెన్నుముకగా నిలవనున్నారు.

ఇది కూడా చదవండి: అన్నీ గుండు సున్నాలే.. టీమిండియాను సర్వ నాశనం చేసిన ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోతది..!

ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ ఏడో స్థానంలో రానుండగా, స్పిన్ మాయాజాలం ప్రదర్శించడానికి ఎనిమిదో స్థానంలో కుల్దీప్ యాదవ్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నారు. అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్, గుర్‌నూర్ బ్రార్‌లు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.

మ్యాచ్ సమయం:

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు టాస్ వేస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us