AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: యుద్ధం వద్దంటూ పాక్ క్రికెటర్ల వేడుకోలు.. భారత్ ‘ఆపరేషన్ సింధూర్‌’తో వణికిపోతున్నారుగా..

Operation Sindoor in POK: ఒకవైపు, POKలో భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌తో భారత క్రికెటర్లు గర్వపడుతున్నారు. మరోవైపు, పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం యుద్ధాన్ని పరిష్కారంగా పరిగణించడం లేదు. శాంతి కావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Operation Sindoor: యుద్ధం వద్దంటూ పాక్ క్రికెటర్ల వేడుకోలు.. భారత్ 'ఆపరేషన్ సింధూర్‌'తో వణికిపోతున్నారుగా..
Ind Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: May 07, 2025 | 10:36 AM

Operation Sindoor: పహల్గామ్ దాడికి భారతదేశం దీటుగా స్పందించింది. భారత వైమానిక దళం పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. ఈ క్రమంలో భారత క్రికెటర్లు ఈ ప్రతీకార చర్యతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు, పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం కాపాడాలంటూ వేడుకుంటున్నారు. భారతదేశం, పాకిస్తాన్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఈ పరిస్థితిపై ఇన్‌స్టా కథనాల ద్వారా వెల్లడించారు.

సైన్యం చర్య పట్ల భారత క్రికెటర్లు ఏమన్నారంటే..

పీఓకేలో వైమానిక దాడి తర్వాత, గౌతమ్ గంభీర్, వరుణ్ చక్రవర్తి, సురేష్ రైనా వంటి క్రికెట్ స్టార్లు భారత వైమానిక దళం విజయం పట్ల సంతోషంగా ఉన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ అని ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

భారత్ సమాధానంతో వణికిపోయిన పాకిస్తాన్..

View this post on Instagram

A post shared by Suresh Raina (@sureshraina3)

కానీ, పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి భారతీయులలా లేదు. వాళ్ల ఇన్‌స్టా స్టోరీ చూస్తుంటే, యుద్ధం అనే పేరు వింటేనే భయపడుతున్నట్లు అనిపిస్తుంది. పాకిస్తాన్ ఆల్ రౌండర్ హసన్ అలీ తన ఇన్‌స్టా స్టోరీలో – యుద్ధం పరిష్కారం కాదు, శాంతియే పరిష్కారం అంటూ రాసుకొచ్చాడు. మేం శాంతిని కోరుకుంటున్నాం, యుద్ధం కాదంటూ తేల్చేశాడు.

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ భార్య కోమల్ ఖాన్ కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని పోస్ట్ చేసి, యుద్ధం అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ద్వారా ఏమి సాధిస్తుంది అంటూ రాసుకొచ్చింది. ఓ అల్లాహ్, పాకిస్తాన్‌ను, మనందరినీ, మన సైనికులను రక్షించు’ అంటూ రాసుకొచ్చింది.

మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ తన ఇన్‌స్టా స్టోరీలో పాకిస్తాన్, పాకిస్తాన్ సైన్యం జిందాబాద్ నినాదాలు చేశాడు.

భారత ప్రతీకార ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. కానీ, పాకిస్తాన్ మొత్తం భయంతో వణికిపోతోంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం ఈ ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చంపారు. ఆ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్‌కు ప్లాన్ చేసి, సక్సెస్ అయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!