
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలు
యుద్ధమంటే బాంబుల వర్షం కురిపించడం, శతఘ్నులను గురిపెట్టడమా? విమానాలు శత్రు దేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్లా? క్షిపణులు ఎక్కుపెడితేనే సమరభేరి మోగినట్టా? కానే కాదు.. ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు. విల్లంబులు సంధించే యుద్ధాలు కావు. రక్తం కళ్లజూస్తేనే, శత్రువు లొంగిపోతేనే విజయమనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. బొందిలో ప్రాణమున్నా ఊపిరి ఆపేయొచ్చు. బలప్రయోగం చేయకుండానే కాళ్లూచేతులు కట్టేయొచ్చు. పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ చేస్తోంది అదే. ఆ లెక్కన పాకిస్తాన్పై భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసింది. వరుస స్ట్రయిక్స్తో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది.
వాటర్ స్ట్రయిక్తో పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టేసింది భారత్. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దుచేయడం శత్రువు ఊహకైనా అందని మేజర్ ఎటాక్. ఇప్పుడా నదిపై ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతోంది మేరా భారత్. సింధూ ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్తో షేర్ చేసుకోవాలి. కానీ ఒప్పందమే రద్దయిపోవటంతో పాకిస్తాన్కి చెప్పడానికేం లేదు.. చేసుకుంటూ పోవడమే. చీనాబ్ నదిపై సలాల్ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేయటంతో పాకిస్తాన్ గొంతు ఎండటం మొదలైంది.
పాకిస్తాన్కు ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులను నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది భారత్. దాయాది దేశంనుంచి అన్ని దిగుమతులూ నిలిపేసింది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. అటు దౌత్యపరంగా కూడా పాక్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాకిస్తాన్కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్యాకేజీ ప్రకటించిన ఐఎంఎఫ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఏడీబీ బ్యాంక్ అధ్యక్షుడితో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు నిధులు ఇవ్వొద్దని కోరారు కేంద్రమంత్రి. మరోవైపు.. పాకిస్తాన్ మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లోకి వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది.
పాక్ నుంచి భారత్కు వచ్చే అన్ని మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు, నోటి దురుసుతో అదే యుద్ధమనుకుంటోంది. తుర్కియే సాయమే గొప్పనుకుంటోంది. చైనా మద్దతిస్తుందని ఆశపడుతోంది. కానీ అదే సమయంలో రష్యా-భారత్కు మద్దతిచ్చింది. ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే పాక్ బలూచిస్తాన్లో అంత్యరుద్ధం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. నీళ్లుకూడా అందక రేపు తిండిగింజలకు కూడా అలమటించాల్సి వచ్చేలా ఉంది. అందుకే పిచ్చిపట్టినట్లు నియంత్రణరేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
బయటకు వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం.. ఇది పాక్ జర్నలిస్టుల మాట. ఉగ్రవాదులను పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో ఉన్నారు పాక్ ప్రజలు కూడా. ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇస్లామాబాద్లోని లాల్ మసీదులో జరిగిన ఘటనే నిదర్శనం. భారత్తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలానా అడిగితే.. ఒక్కటంటే ఒక్క చెయ్యీ పైకిలేవలేదు. పాక్లోని అంతర్గత రాజకీయాలు, ఆర్థికసంక్షోభంతో పాక్ ప్రజలు విసిగివేసారిపోయారు. పాలకులతో పాటు సైన్యంపైనా నమ్మకం కోల్పోతున్నారు. భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్కి ఇంతకంటే ఘోర అవమానం ఏముంటుంది? మరోవైపు ఆ దేశ నేతలు మాత్రం అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
అసిఫ్ మునీర్ క్షమాపణ చెప్పకపోతే, కరాచీ సముద్రం గర్భంలో కలిసిపోయేది!
భారతదేశంలోని మూడు సైన్యాలు ఆపరేషన్ సింధూర్ కోసం సిద్ధమయ్యాయి. భారత నావికాదళం పాకిస్తాన్ను సముద్రంలో చుట్టుముట్టింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పరాక్రమం తెలిసి, పాకిస్తాన్ యుద్ధనౌకలు ఓడరేవుల చుట్టూ చూస్తూ ఉండిపోయాయి. బహుశా పాకిస్థాన్కు 1971లో కరాచీలోని నావికా ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. 7 రోజుల పాటు నిప్పురవ్వ మండుతూనే ఉన్న పరిస్థితులు గుర్తుకు వచ్చి ఉండవచ్చు.
- Balaraju Goud
- Updated on: May 13, 2025
- 7:58 am
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా మే 13, 2025న జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత ఈ విమానాశ్రయాలన్నీ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి.
- Balaraju Goud
- Updated on: May 13, 2025
- 8:04 am
Operation Sindoor: అబ్ నహీతో కభీ నహీ.. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటే.. టార్గెట్ ఫిక్స్ అయినట్టే..
భారత్-పాక్ మధ్య సీజ్ఫైర్ అమల్లోకి వచ్చిన వెంటనే.. ఈ దేశ ప్రజల మదిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే. ఏంటి.. పీవోకేను స్వాధీనం చేసుకోకముందే పాకిస్తాన్పై ప్రతిదాడులు ఆపేస్తున్నామా అని. యుద్ధ విరమణ అంటే విరామం మాత్రమే. యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్టు కాదు. అంటే.. పీవోకేను భారత్ స్వాధీనం చేసుకోవడం అనే ఆలోచన ఆగలేదు, పుల్స్టాపూ పడలేదు. మరైతే.. నెక్ట్స్ ఏం జరగబోతున్నట్టు? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను ఎలా సాధించుకోబోతున్నాం. బుల్లెట్ పేలకుండా, రక్తం చిందకుండా, యుద్ధం జరక్కుండానే పీవోకే మన సొంత అవబోతోందా? అంతర్గతంగా నడుస్తున్న చర్చ ఏంటి?
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 10:30 pm
India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..
భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వక్రబుద్దిని మరోసారి చూపించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం.. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి.. ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర డ్రోన్ల కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 10:24 pm
Donald Trump: భారత్ – పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత.. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్-పాక్ మధ్య అణు వివాదానికి బ్రేక్ వేశా అంటూ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి.. దాడులు విరమించాలని.. ఒత్తిడి తెచ్చా అంటూ ట్రంప్ తెలిపారు.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 9:23 pm
PM Modi: అణుబాంబుల పేరుతో ఎవరు బెదిరించలేరు: ప్రధాని మోదీ
PM Modi: భారతదేశం ఎటువంటి అణ్వస్త్ర బెదిరింపులను సహించదు. భారతదేశం తన సొంత షరతులపై తగిన సమాధానం ఇస్తుంది. అణు బెదిరింపు ముసుగులో అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఖచ్చితమైన, నిర్ణయాత్మక దాడిని ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం తన పౌరుల గుర్తింపు..
- Subhash Goud
- Updated on: May 12, 2025
- 9:01 pm
PM Modi: ఆ రెండు అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయ్.. పాకిస్తాన్కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..
ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మోదీ స్పష్టంచేశారు. లేదంటే శాంతికి వేరే ఏ మార్గం లేదన్నారు. టెర్రర్ - టాక్స్, టెర్రర్ - ట్రేడ్, ఇవి ఒకసారి కలిసి సాగలేవు.. ఉగ్రవాదం - చర్చలు, ఉగ్రవాదం - వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అంటూ మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్తో చర్చలు జరపాల్సి వస్తే.. ఉగ్రవాదంపై, POK పై మాత్రమే జరుగుతాయంటూ మోదీ స్పష్టంచేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 8:44 pm
PM Modi: మన తల్లుల సిందూరం దూరం చేస్తే.. ఏం జరుగుతుందో చేసి చూపించాం..
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారు.. మన బలగాలకు నా సెల్యూట్ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితమంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 8:24 pm
Operation Sindoor: టార్గెట్ ఫిక్స్ చేస్తే పేలిపోవాల్సిందే.. భారత్ ఆర్మీ సంచలన వీడియో విడుదల..
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ను హడలెత్తించింది.. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన భారత్.. మిస్సైళ్లతో విరుచుకుపడింది.. వాటన్నింటిని నేలమట్టం చేయడంతోపాటు.. దాదాపు 100 మంది ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టింది.
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 6:59 pm
PM Modi Operation Sindoor Update Highlights: ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం: మోదీ
Narendra Modi on India Pakistan Ceasefire Updates in Telugu: నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత శనివారం భారతదేశం- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. దీని తరువాత సరిహద్దులో ఉద్రిక్తత తగ్గింది. ఉగ్రవాదులపై భారతదేశం చర్య తీసుకున్న తర్వాత తలెత్తిన పరిస్థితి రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమయ్యేలా ఉంది.
- Subhash Goud
- Updated on: May 12, 2025
- 9:10 pm