AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం నెరవేరింది.. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన 5 ఫైటర్ జెట్‌లు ధ్వంసమయ్యాయని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ అన్నారు. మురిద్కే , బహావల్‌పూర్‌ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు, మరో పెద్ద విమానం కూడా ధ్వంసమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 కు క్రెడిట్ ఇచ్చారు.

ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యం నెరవేరింది.. అసలు నిజాలు బయటపెట్టిన ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఏపీ సింగ్‌
Air Chief Marshal On Operation Sindoor
Balaraju Goud
|

Updated on: Aug 09, 2025 | 1:30 PM

Share

ఆపరేషన్‌ సింధూర్‌పై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. S-400 డిఫెన్స్‌ సిస్టమ్‌ అద్భుతంగా పనిచేసిందని కితాబు ఇచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్స్‌తో సహా ఆరు విమానాలను కూల్చేసినట్టు ప్రకటించారు. 9 ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. మురిద్కే , బహావల్‌పూర్‌ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దీంతో పాటు, మరో పెద్ద విమానం కూడా ధ్వంసమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 కు క్రెడిట్ ఇచ్చారు.

కూలిపోయిన పెద్ద విమానాన్ని “బిగ్ బర్డ్” అంటే ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) అని వర్ణించారు. ఇది పాకిస్తాన్ నిఘా, కమాండ్ సామర్థ్యంలో ముఖ్యమైన భాగం. ఈ వైమానిక దాడుల క్రెడిట్‌ను రష్యన్ నిర్మిత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ఇచ్చారు ఎయిర్ చీఫ్ మార్షల్. పాకిస్తాన్ విమానాలను లక్ష్యంగా చేసుకుని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేస్తామని పాక్‌ DGMOకు చెప్పి మరీ దాడులు చేసినట్టు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ తెలిపారు.

బెంగళూరులో జరిగిన ఎయిర్ మార్షల్ కాత్రే వార్షిక ఉపన్యాసంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ మాట్లాడుతూ, బహావల్పూర్‌లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడికి ముందు.. తరువాత ఉపగ్రహ చిత్రాలు చుట్టుపక్కల భవనాలకు గణనీయమైన నష్టం జరగలేదని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. స్థానిక మీడియా ద్వారా ఉగ్రవాద స్థావరాల లోపల నుండి ఉపగ్రహ చిత్రాలు మాత్రమే మనకు అందాయని ఆయన అన్నారు. భారత వాయుసేన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు ఎయిర్ మార్షల్. 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలిపారు.

ఇదిలావుంటే, పహల్గామ్ దాడి తర్వాత మే 7న ” ఆపరేషన్ సిందూర్” అను భారత సైన్యం సమర్థవంతంగా నిర్వహించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యకు దిగింది భారత్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!