AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలియకపోతే మీ ప్రాణాలకే రిస్క్..

ఇంట్లో పెద్దలు అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగవద్దని తరచుగా చెబుతుంటారు. చాలామంది దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు. కానీ శాస్త్రీయంగా, ఆయుర్వేదం ప్రకారం దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఆకలిగా ఉన్నప్పుడు తొందరపడి అరటిపండు తిని నీళ్లు తాగడం మీ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Krishna S
|

Updated on: Feb 27, 2026 | 8:49 PM

Share
జీర్ణక్రియపై ప్రభావం: అరటిపండును ఆయుర్వేదంలో చల్లని పండుగా పరిగణిస్తారు. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే రసాలు బలహీనపడతాయి. జీర్ణ ప్రక్రియ నెమ్మదించడం వల్ల పండు సరిగ్గా జీర్ణం కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు వస్తాయి.

జీర్ణక్రియపై ప్రభావం: అరటిపండును ఆయుర్వేదంలో చల్లని పండుగా పరిగణిస్తారు. అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే రసాలు బలహీనపడతాయి. జీర్ణ ప్రక్రియ నెమ్మదించడం వల్ల పండు సరిగ్గా జీర్ణం కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు వస్తాయి.

1 / 5
కఫ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు శరీరంలో కఫను పెంచుతాయి. అరటిపండు తిన్న వెంటనే ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారి, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు లేదా జలుబుకు దారితీస్తుంది. ఇప్పటికే కఫ సమస్యలు ఉన్నవారు ఈ తప్పు అస్సలు చేయకూడదు.

కఫ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు శరీరంలో కఫను పెంచుతాయి. అరటిపండు తిన్న వెంటనే ముఖ్యంగా చల్లటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారి, గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు లేదా జలుబుకు దారితీస్తుంది. ఇప్పటికే కఫ సమస్యలు ఉన్నవారు ఈ తప్పు అస్సలు చేయకూడదు.

2 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు: అరటిపండ్లలో ఫైబర్, సహజ చక్కెర అధికంగా ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల చక్కెర శాతం శరీరంలోకి చాలా వేగంగా శోషించబడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు: అరటిపండ్లలో ఫైబర్, సహజ చక్కెర అధికంగా ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల చక్కెర శాతం శరీరంలోకి చాలా వేగంగా శోషించబడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

3 / 5
కడుపు నొప్పి: అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారంగా అనిపించడం, కడుపు నొప్పి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడమే కాకుండా కొంతమందిలో వాంతులు లేదా వికారం కూడా సంభవించవచ్చు.

కడుపు నొప్పి: అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారంగా అనిపించడం, కడుపు నొప్పి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడమే కాకుండా కొంతమందిలో వాంతులు లేదా వికారం కూడా సంభవించవచ్చు.

4 / 5
నీరు ఎప్పుడు తాగాలి?: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా పండు తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది. మీకు బాగా దాహం వేస్తే, అరటిపండు తినడానికి 10 -15 నిమిషాల ముందు నీళ్లు తాగండి. అరటిపండ్లు గొప్ప శక్తి వనరులు, కానీ వాటిని తినే విధానం కూడా ముఖ్యమే. ఈ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నీరు ఎప్పుడు తాగాలి?: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా పండు తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది. మీకు బాగా దాహం వేస్తే, అరటిపండు తినడానికి 10 -15 నిమిషాల ముందు నీళ్లు తాగండి. అరటిపండ్లు గొప్ప శక్తి వనరులు, కానీ వాటిని తినే విధానం కూడా ముఖ్యమే. ఈ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

5 / 5
Follow Us