AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor 2.0: ఈసారి ఆ మాటే ఉండదు.. భూమిపై ఉండాలో వద్దో పాకిస్తాన్‌ తేల్చుకోవాలి: ఆర్మీ చీఫ్ ద్వివేది

ఇండియన్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఐకమత్యంగా ఈ యుద్దంలో పోరాడిందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌ ధ్వంసం చేశాయన్నారు.

Operation Sindoor 2.0: ఈసారి ఆ మాటే ఉండదు.. భూమిపై ఉండాలో వద్దో పాకిస్తాన్‌ తేల్చుకోవాలి: ఆర్మీ చీఫ్ ద్వివేది
Army Chief Dwivedi
Shaik Madar Saheb
|

Updated on: Oct 03, 2025 | 5:55 PM

Share

ఇండియన్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పామంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్మీ చీఫ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0 ఉంటుందని, దీనికి సైన్యం సిద్దంగా ఉండాలన్నారు. ఈ అవకాశం వెంటనే ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటునట్టు చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2.0లో సంయమనం అనే మాట వినపడదన్నారు ఆర్మీ చీఫ్‌.. మాట వినకుంటే.. భూగోళంలో పాకిస్తాన్‌ను లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ తో జరిగిన ఈ యుద్దంలో దేశమంతా ఐకమత్యంగా పోరాడిందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌ ధ్వంసం చేశాయన్నారు. హద్దు మీరితే.. కఠిన చర్యలు తప్పవన్నారు. భూగోళంలో ఉండాలో లేదో పాకిస్తాన్‌ తేల్చుకోవాలంటూ ద్వివేది హెచ్చరించారు.

కాగా.. రాజస్థాన్‌లోని ఇండో పాక్‌ సరిహద్దు ప్రాంతమైన శ్రీగంగానగర్ అనుప్‌గఢ్‌ ను ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సందర్శించారు. ఈ సందర్భంగా ద్వివేది జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే పొరుగు దేశం తన గడ్డపై ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం మానేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యూఢిల్లీ చూపిన సంయమనం భవిష్యత్తులో చూపమని హెచ్చరించారు. “ఒక దేశంగా భారతదేశం ఈసారి పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈసారి, ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని అది ప్రదర్శించదు. ఈసారి మనం ఒక అడుగు ముందుకు వేసి, పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటున్నారా లేదా అని ఆలోచించేలా వ్యవహరిస్తాము” అని జనరల్ ద్వివేది అన్నారు.

“మేము ఉగ్రవాదులకు హాని కలిగించాలని మాత్రమే కోరుకుంటున్నాము కాబట్టి లక్ష్యాలను గుర్తించాము. వారి స్థావరాలపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. పాకిస్తాన్‌లోని సాధారణ పౌరులపై మాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారి దేశం ఉగ్రవాదులను స్పాన్సర్ చేస్తున్నందున, ఆ ఉగ్రవాద లక్ష్యాలను ఛేదించారు” అని జనరల్ ద్వివేది తన ప్రకటనలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి