IND vs AUS: కోహ్లీ, రోహిత్తోపాటు జర్నీ చేయని గంభీర్.. కారణం ఏంటంటే?
Team India: ఈ సిరీస్కు ముందు, టీమిండియా వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ టెస్టు సిరీస్ మంగళవారం (అక్టోబర్ 14) ముగియడంతో, అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఆ తరువాత రోజు ప్రయాణానికి సిద్ధమయ్యారు. గంభీర్ కూడా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లో జట్టుతో ఉన్నారు.

Team India: భారత క్రికెట్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఆస్ట్రేలియాతో జరగబోయే ముఖ్యమైన మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కూడిన టీమిండియా తొలి బ్యాచ్ ఆటగాళ్లు ఆసీస్కు బయలుదేరారు. అయితే, ఈ తొలి బృందంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేకపోవడం విశేషం.
తొలి బ్యాచ్లో అగ్రశ్రేణి ఆటగాళ్లు..
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా మొదటి బ్యాచ్ ఆటగాళ్లు బుధవారం (అక్టోబర్ 15, 2025) ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు.
జట్టు సభ్యులు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ తొలి బృందంలో ఉన్నారు. ఆటగాళ్లతో పాటు కొంతమంది సపోర్ట్ స్టాఫ్ కూడా ఆస్ట్రేలియా వెళ్లారు.
కోచ్ గంభీర్ ప్రయాణం ఎప్పుడు?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కోచింగ్ సిబ్బందిలోని మరికొంతమంది సభ్యులు మాత్రం బుధవారం సాయంత్రం తర్వాత ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు.
ఈ సిరీస్కు ముందు, టీమిండియా వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ టెస్టు సిరీస్ మంగళవారం (అక్టోబర్ 14) ముగియడంతో, అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఆ తరువాత రోజు ప్రయాణానికి సిద్ధమయ్యారు. గంభీర్ కూడా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్లో జట్టుతో ఉన్నారు.
కోహ్లీ, రోహిత్పైనే అందరి దృష్టి..
టెస్టులు, టీ20ల నుంచి వైదొలిగిన తర్వాత, వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేస్తుండటం పట్ల ఈ సిరీస్పై మరింత ఆసక్తి నెలకొంది. వీరు చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే మ్యాచ్ ఆడారు.
ఆస్ట్రేలియా సిరీస్లో వారి అనుభవం జట్టుకు చాలా విలువైనదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్ భవితవ్యంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వకుండా, “ప్రస్తుత కాలంలో ఉండటం చాలా ముఖ్యం. రాబోయే పర్యటనలో కోహ్లీ, రోహిత్ బాగా రాణించాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
సిరీస్ షెడ్యూల్..
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ అక్టోబర్ 19 న పెర్త్లో ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కూడా జరగనుంది.
మొదటి వన్డే – అక్టోబర్ 19 – పెర్త్
రెండో వన్డే – అక్టోబర్ 23 – అడిలైడ్
మూడో వన్డే- అక్టోబర్ 25 – సిడ్నీ
ఈ సిరీస్లో రోహిత్, కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








