AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్ టైమ్ వన్డే ప్లేయింగ్ XIలో టీమిండియా దిగ్గజానికి షాకిచ్చాడు.. కట్‌చేస్తే.. ఆ తర్వాత యూ టర్న్..

Glenn Maxwell All Time ODI XI: ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్‌వెల్‌ను భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లతో మాత్రమే కూడిన ఆల్-టైమ్ వన్డే జట్టును ఎంపిక చేయమని కోరారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు డేవిడ్ వార్నర్‌ను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆల్ టైమ్ వన్డే ప్లేయింగ్ XIలో టీమిండియా దిగ్గజానికి షాకిచ్చాడు.. కట్‌చేస్తే.. ఆ తర్వాత యూ టర్న్..
Team India
Venkata Chari
|

Updated on: Oct 15, 2025 | 4:49 PM

Share

Glenn Maxwell All Time ODI XI: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఇటీవల ప్రకటించిన తన ఆల్-టైమ్ ODI XI జట్టు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు తెరతీసింది. దీనికి కారణం, మాక్స్‌వెల్ తన తొలి ఎంపికలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు చోటు ఇవ్వకుండా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను (David Warner) ఎంచుకోవడమే. అయితే, ఈ ఎంపిక వెనుక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అది చివరకు మాక్స్‌వెల్‌ను తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది.

సచిన్‌ను కాదని వార్నర్‌ను ఎందుకు ఎంచుకున్నాడు..?

మాక్స్‌వెల్‌ను భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లతో మాత్రమే కూడిన ఆల్-టైమ్ వన్డే జట్టును ఎంపిక చేయమని కోరారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు డేవిడ్ వార్నర్‌ను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వార్నర్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం, అతనికి కుడిచేతి-ఎడమచేతి ఓపెనింగ్ భాగస్వామ్యం కావాలని భావించడమే. “రోహిత్ శర్మ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. నేను డేవీ (డేవిడ్ వార్నర్)తో వెళ్తాను. సగటు 45, స్ట్రైక్-రేట్ 97, 22 సెంచరీలు. ఇద్దరూ డేంజరస్ ఓపెనర్లు. నేను సచిన్‌ను కూడా ఎంచుకోవచ్చు. కానీ రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌తో మొదలుపెట్టాలని అనుకుంటున్నాను” అని మాక్స్‌వెల్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నిబంధనతో మారిన నిర్ణయం..!

మాక్స్‌వెల్ జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో, అతనికో నిబంధనను గుర్తు చేశారు. ఆ నిబంధన ఏంటంటే, జట్టులో గరిష్టంగా ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. అయితే, మాక్స్‌వెల్ మొదట్లో ఎంచుకున్న జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య గరిష్ట పరిమితిని దాటింది.

ఈ విషయాన్ని గుర్తించిన మాక్స్‌వెల్ వెంటనే తన ఎంపికను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో, అతను జట్టు నుంచి డేవిడ్ వార్నర్‌ను తొలగించి, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకున్నాడు.

ఈ క్రమంలో మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. “నేను డేవీని తొలగించక తప్పదు. డేవీ అవుట్, సచిన్ ఇన్. నిజం చెప్పాలంటే, సచిన్ మూడు రెట్లు ఎక్కువ పరుగులు చేశాడు కదా” అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

దీంతో, సచిన్‌ను మొదట్లో పక్కన పెట్టినా, చివరకు నిబంధనల కారణంగా మాస్టర్ బ్లాస్టర్‌కు మాక్స్‌వెల్ ఆల్-టైమ్ XIలో చోటు దక్కింది.

మాక్స్‌వెల్ తుది ఆల్-టైమ్ ODI XI (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లతో): చివరికి, సచిన్ టెండూల్కర్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత మాక్స్‌వెల్ ఎంపిక చేసిన జట్టు ఇదే..

1. సచిన్ టెండూల్కర్ (భారత్)

2. రోహిత్ శర్మ (భారత్)

3. విరాట్ కోహ్లీ (భారత్)

4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)

5. మైకేల్ బెవన్ (ఆస్ట్రేలియా)

6. ఎంఎస్ ధోని (కీపర్) (భారత్)

7. షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)

8. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)

9. గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)

10. జస్‌ప్రీత్ బుమ్రా (భారత్)

11. అనిల్ కుంబ్లే (భారత్)

మాక్స్‌వెల్ ఈ జట్టులో ఇంగ్లాండ్ నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంచుకోకపోవడం మరో విశేషం. అంతేకాక, ఈ జట్టులో ఆరుగురు భారత్, ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు.

క్రికెట్‌లో ఇలాంటి సరదా ఎంపికలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక ODI పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌ను మొదట పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించినా, నిబంధనల కారణంగానైనా సచిన్‌కు జట్టులో చోటు దక్కడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..