AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?

ప్రతిష్ఠాత్మక 9వ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది.

Team India: రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?
Team India
Basha Shek
|

Updated on: Jun 30, 2024 | 9:15 PM

Share

ప్రతిష్ఠాత్మక 9వ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌కు బిగ్ బాస్ అయిన బీసీసీఐ.. తన ఛాంపియన్ టీమ్‌కి భారీ నజరానా ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రోహిత్ సేనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించింది బీసీసీఐ. దీనికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ సెక్రెటరీ జైషా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు .. ‘9వ టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాకు రికార్డు స్థాయిలో 125 కోట్ల బహుమతి ప్రకటించడం ఆనందంగా ఉంది. టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుతమై ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులందరికీ అభినందనలు’ అని జైషా ట్వీట్ చేశారు.

టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రికార్డు మొత్తాన్ని బహుమతిగా ప్రకటించి యావత్ ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు ఏ ఛాంపియన్ జట్టు ఈ స్థాయిలో ప్రైజ్ మనీ అందుకోలేదు. భవిష్యత్తులో కూడ అందుకునే అవకాశం దాదాపు లేదు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన టీమిండియా, జట్టు సహాయక సిబ్బందికి మొత్తం రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లో ఈ టీమ్ ఇండియా గెలిచినప్పుడు బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌కి, ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్‌కి మధ్య చాలా తేడా ఉంది. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఒక్కో ఆటగాడికి బీసీసీఐ 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేసింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్ ఇదిగో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?