క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ తెలంగాణ క్రికెటర్ల శ్రేయ‌స్సు, ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్‌ను నియ‌మించేందుకు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
Cricket Stadium
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 30, 2024 | 9:45 PM

బీసీసీఐ స‌హ‌కారంతో రాష్ట్రంలో క్రికెట్ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) కొన్ని విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఆదివారం జ‌రిగిన అపెక్స్‌ కౌన్సిల్ స‌మావేశంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు, కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్ సునిల్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ తెలంగాణ క్రికెటర్ల శ్రేయ‌స్సు, ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్‌ను నియ‌మించేందుకు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు త్వ‌ర‌లో కొత్త అంత‌ర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నామ‌ని, స‌ర్కార్ భూమిస్తే సుల‌భంగా క‌ట్ట‌వ‌చ్చు అన్నారు. అలానే రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని, టెండ‌ర్లు పిలిచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్టేడియంలో ట‌ర్ఫ్ వికెట్‌, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయ‌నున్నామ‌ని తెలిపారు.

జూలై 8 నుంచి డొమిస్టిక్ సీజ‌న్ ప్రారంభం..

ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వ‌నుందని కార్య‌ద‌ర్శి దేవ్‌రాజ్ చెప్పారు. అలానే మ‌హిళ‌ల లీగ్ క్రికెట్‌ను కూడా ప్రారంభించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. ఉప్ప‌ల్ స్టేడియంలో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ నిర్మించే ప్ర‌ణాళిక ఉంద‌ని పేర్కొన్నారు. కొత్త కోచ్‌లు, అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్, స్కోరర్ల ఉద్యోగాల భ‌ర్తీ కూడా చేప‌ట్ట‌నున్నామ‌ని దేవ్‌రాజ్ తెలిపారు.

పెండింగ్ ఆడిట్ల‌కు మోక్షం..

2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆడిట్ల‌ను ఆమోదించామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రావు తెలిపారు. ఇవి బీసీసీఐకి పంపిస్తే, బీసీసీఐ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయ‌ని చెప్పారు. ఇక‌, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఒక క‌మిటీని వేశామ‌ని, ఇందులో అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒక‌రు, ఏజీ నుంచి ఒక‌రు, ఒక న్యాయ‌వాది ఉంటార‌ని చెప్పారు. వీరు విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తార‌ని జ‌గ‌న్ మోహ‌న్ రావు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై
ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని ఆఫర్స్‌.. స్మార్ట్‌ ఫోన్స్‌పై
'ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు'..హార్దిక్ సతీమణిపై అభిమానుల ఆగ్రహం
'ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు'..హార్దిక్ సతీమణిపై అభిమానుల ఆగ్రహం
రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
మేనమామను హతమార్చిన మైనర్.. విషయం తెలిసి షాక్..!
మేనమామను హతమార్చిన మైనర్.. విషయం తెలిసి షాక్..!
చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!
చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!
ఇద్దరి మధ్య అసూయ లేదు.. కలిసి సినిమా అందుకే చేయలేదు.. కమల్.
ఇద్దరి మధ్య అసూయ లేదు.. కలిసి సినిమా అందుకే చేయలేదు.. కమల్.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
రూ. 1500ల్లో వీకెండ్ టూర్‌.. జోగులాంబతో పాటు..
రూ. 1500ల్లో వీకెండ్ టూర్‌.. జోగులాంబతో పాటు..
తగ్గనున్న ప్రభాస్ 'కల్కి' సినిమా టికెట్ల ధరలు.. ఎప్పటినుంచంటే?
తగ్గనున్న ప్రభాస్ 'కల్కి' సినిమా టికెట్ల ధరలు.. ఎప్పటినుంచంటే?
ప్రభాస్‏కు సిగ్గు ఎక్కువ.. కానీ అతడు చాలా స్వీట్.. హీరోయిన్..
ప్రభాస్‏కు సిగ్గు ఎక్కువ.. కానీ అతడు చాలా స్వీట్.. హీరోయిన్..