AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi: వైష్ణోదేవి ఎందుకు ప్రసిద్ది చెందింది? వైష్ణవి తపస్సు చేసిన గుహ రహస్యం ఏమిటి తెలుసా..

జమ్మూలోని త్రికూట కొండలలో ఉన్న వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ చెందిన అమ్మవారి ఆలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు. ఈ రోజు వైష్ణో దేవి ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం..

Vaishno Devi: వైష్ణోదేవి ఎందుకు ప్రసిద్ది చెందింది? వైష్ణవి తపస్సు చేసిన గుహ రహస్యం ఏమిటి తెలుసా..
Vaishno Devi
Surya Kala
|

Updated on: Aug 18, 2025 | 3:12 PM

Share

జమ్మూలో ఉన్న వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం జమ్మూలోని త్రికూట కొండలలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన అన్ని శక్తిపీఠాలలో వైష్ణో దేవి అత్యంత దైవికంగా పరిగణించబడుతుంది. అయితే వైష్ణో మాత అంత ప్రసిద్ధి చెందినప్పటికీ.. ఏ వేద-పురాణంలోనూ వైష్ణో దేవి గురించి ప్రస్తావన లేదు. అయితే వైష్ణో మాత ఎలా ఇక్కడ వెలసింది. ఈ ఆలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందిందో తెలుసుకుందాం..

వైష్ణో దేవి ఎందుకు ప్రసిద్ధి చెందింది? జమ్మూ కాశ్మీర్‌లోని త్రికూట పర్వతంపై ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం దుర్గా దేవి 108 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలాలలో ఒకటి. ఈ ఆలయం 5,200 అడుగుల ఎత్తులో ఉంది. నవరాత్రి సమయంలో రద్దీగా ఉంటుంది. మాతా వైష్ణో దేవి ఆలయంతో సంబంధం ఉన్న అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇక్కడ ఉన్న గుహ. ఈ గుహ చాలా రహస్యంగా పరిగణించబడుతుంది. ఇది ఈ ఆలయంలో ముఖ్యమైన భాగం.

వైష్ణో దేవి గుహ రహస్యం ఏమిటి? త్రికూట పర్వతంపై ఉన్న వైష్ణో దేవి గుహను “గర్భజూన్ గుహ” అని కూడా పిలుస్తారు. వైష్ణో దేవి యాత్ర మార్గంలో అర్ధకువారిలో ఉంది. మాతా వైష్ణో దేవి ఈ గుహలో 9 నెలలు తపస్సు చేసి భైరవనాథుడి నుంచి దాక్కున్నట్లు.. ఒక బిడ్డ తన తల్లి గర్భంలో ఉన్నట్లుగా తపస్సు చేసిందని చెబుతారు. ఈ గుహలోకి ప్రవేశించడం ద్వారా మహిళలు గర్భధారణ, ప్రసవ సమయంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని మత విశ్వాసం ఉంది.

ఇవి కూడా చదవండి

వైష్ణో దేవిని దర్శించుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? హిందూ విశ్వాసాల ప్రకారం జమ్మూలోని మాతా వైష్ణో దేవిని సందర్శించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. వారు ఆనందం, శాంతి, శ్రేయస్సుతో ఆశీర్వదించబడతారు. ఈ ఆలయం హిందూ మతంలో పవిత్రమైన తీర్థయాత్ర, ఇక్కడ మాతా వైష్ణో దేవిని సందర్శించడం ద్వారా కష్టాలు తొలగి.. అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మాకం.

నవరాత్రిలో ప్రత్యేక ప్రాముఖ్యత: నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, యాగాలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

పౌరాణిక ప్రాముఖ్యత: వైష్ణో దేవి ఆలయంతో సంబంధం ఉన్న అనేక పౌరాణిక కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఇవి దీనిని మరింత ప్రత్యేకమైనవిగా చేస్తాయి.

గుహ ఆవిష్కరణ: వైష్ణో దేవి ఆలయంలోని గుహను సుమారు 700 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ పూజారి పండిట్ శ్రీధర్ కనుగొన్నారని చెబుతారు.

భైరవనాథుని వధ: మాతా వైష్ణో దేవి భైరవనాథుడిని సంహరించింది. మాతను సందర్శించిన తర్వాత భైరవనాథుడిని సందర్శించడం తప్పనిసరి అని విశ్వాసం.

భైరవనాథ ఆలయం: భైరవనాథ ఆలయం వైష్ణో దేవి గుహ సమీపంలో ఉంది. ఇది తీర్థయాత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కూడా పరిగణించబడుతుంది.

కోరికలు నెరవేరడం: మాతా వైష్ణో దేవి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుందని నమ్ముతారు.

తీర్థయాత్ర: వైష్ణో దేవి ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. కానీ సందర్శించడానికి ఉత్తమ సమయం మార్చి నుంచి అక్టోబర్ మధ్య.

వైష్ణో దేవి ఎలా కనిపించింది? మాతా వైష్ణో దేవి మూలం గురించి ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఈ కథ ప్రకారం వైష్ణవి దేవి దక్షిణ భారతదేశంలో రత్నాకర్ అనే రాజుకు జన్మించింది. బాల్యంలో దేవత పేరు త్రికూట. ఆమె విష్ణువు వంశంలో జన్మించినందున ఆమెను వైష్ణవి అని పిలిచేవారు. మత విశ్వాసం ప్రకారం భైరవ నాథుడి నుంచి తప్పించుకోవడానికి వైష్ణో దేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో ఆశ్రయం పొందింది.

మాతా వైష్ణో దేవి పవిత్ర గుహలో పండిట్ శ్రీధర్ కు మహాసరస్వతి, మహాలక్ష్మి , మహాకాళి రూపంలో కనిపించింది. వీరిని ముగ్గురు పవిత్ర విగ్రహాలుగా పూజిస్తారు. ఆమె ఈ గుహలో తొమ్మిది నెలలు ధ్యానం చేసి, తరువాత భైరవ నాథ్ ను చంపిందని చెబుతారు. దీని తరువాత వైష్ణవి దేవి గుహను తన శాశ్వత నివాసంగా చేసుకుంది. తరువాత ఈ ప్రదేశం మాతా వైష్ణో దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.