Hyderabad: బోనమెత్తిన గోల్కొండ.. అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించిన‌ మంత్రులు..

Hyderabad: హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ప్రారంభమవయ్యాయి. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి...

Hyderabad: బోనమెత్తిన గోల్కొండ.. అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించిన‌ మంత్రులు..
Bonalu 2022
Follow us

|

Updated on: Jun 30, 2022 | 2:22 PM

Hyderabad: హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ప్రారంభమవయ్యాయి. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ…. దీపం వెలిగించి, పూజలు నిర్వహించి తొట్టెల‌కు స్వాగతం పలికారు. అనంత‌రం శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడతూ.. ‘ఈ ఏడాది బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నాము. ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 15 కోట్లు కేటాయించారు. సీఎం ఆదేశాల మేరకే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నాము. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను’ అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..