తొలి రోజే.. ‘పెగాసస్’ పై లోక్ సభలో రభస.. మంత్రివర్గ సహచరులను పరిచయం చేయలేకపోయిన ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా..

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే లోక్ సభలో విపక్షాల రభసతో సభ వేడెక్కింది. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. ప్రతిపక్షాల కేకలు, నినాదాల కారణంగా ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేయలేకపోయారు.

తొలి రోజే.. 'పెగాసస్' పై లోక్ సభలో రభస.. మంత్రివర్గ సహచరులను పరిచయం చేయలేకపోయిన ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా..
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 1:11 PM

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే లోక్ సభలో విపక్షాల రభసతో సభ వేడెక్కింది. పెగాసస్ అంశం సభను కుదిపివేసింది. ప్రతిపక్షాల కేకలు, నినాదాల కారణంగా ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గ సహచరులను సభకు పరిచయం చేయలేకపోయారు. వారి స్లొగన్స్ కారణంగా సభా కార్యాకలాపాలు సజావుగా సాగకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. మోదీ తన కేబినెట్ సహచరులను సభకు పరిచయం చేయబోగా విపక్ష సభ్యుల నినాదాలతో ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే విరమించుకోవలసి వచ్చింది. ఈ దేశంలోని మహిళలు, ఓబీసీలు, రైతు బిడ్డలు మంత్రులు కావడాన్ని బహుశా కొంతమందికి ఇష్టం లేనట్టు ఉంది..అందువల్లే వీరిని పరిచయం చేయడానికి కూడా అనుమతించడం లేదు అని మోదీ అన్నారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన దురదృష్టకరమని, అనారోగ్యకరమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పెగాసస్ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశ భద్రత ముప్పులో పడిందన్నారు.

మరో వైపు పెగాసస్ అంశంపై సభ మొదట చర్చించాలంటూ సీపీఐ రాజ్యసభలో నోటీసునిచ్చింది. ఇలా ఉండగా తొలుత పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ ..దేశాన్ని కుదిపివేస్తున్న కోవిడ్ పాండమిక్ పై సభలో చర్చించాల్సి ఉందని అన్నారు. ఇంతటి ముఖ్యమైన సమస్యపై సభ్యులు తమ విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనన్నారు. ఇక రాజ్యసభలో కూడా విపక్షాలు పెగాసస్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసే సూచనలున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Big Relief: స్వర్ణకారులకు గుడ్‌న్యూస్‌.. పాత బంగారు నగల విక్రయంపై వచ్చే లాభాలకు మాత్రమే జీఎస్టీ

Suspected Death: వారం రోజులుగా కనిపించకుండాపోయిన 11 ఏళ్ల చిన్నారి.. చెరువులో శవమైన తేలింది.. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు..!

మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!