Movie News: రజాకార్ మూవీ ముచ్చట.. బన్నీతో గురూజీ సినిమా ఆగిపోయిందా.?
యాట సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న సినిమా కుబేరా. ధనుష్ విభిన్నంగా కనిపిస్తున్నారు ఇందులో. హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే నాలుగో సినిమాను ప్రకటించారు దర్శక నిర్మాతలు.
![యాట సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. 1947 ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. తాజాగా మార్చ్ 15న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రంపై ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/razakar-2.jpg?w=1280&enlarge=true)
1 / 5
![ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న సినిమా కుబేరా. ధనుష్ విభిన్నంగా కనిపిస్తున్నారు ఇందులో. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ బ్యాంకాక్లో మొదలైంది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్లు చిత్రీకరించనున్నారు. బ్యాంకాక్లో ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/kubera-movie-1.jpg)
2 / 5
![హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. తెలంగాణకు పర్యటనకు వచ్చిన ఆయనను హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీరితో ఉన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/amit-shah-with-hanuman-team.jpg)
3 / 5
![శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా యూనిట్ రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/sk23-film.jpg)
4 / 5
![అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే నాలుగో సినిమాను ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ అది ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ సినిమాపై కొత్త అప్డేట్ వచ్చింది. 2025 సమ్మర్ తర్వాత ఈ సినిమాని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 300 కోట్లతో ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/03/allu-arjun-and-trivikram.jpg)
5 / 5