Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లై రెండు నెలలు కూడా నిండకుండానే అత్తింటి వారి ఘాతుకం.. నవ వధువు అనుమానాస్పద మృతి

కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవ వధువును కడతేర్చాడో పతి దేవుడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. వరకట్నం కోసమే కట్టుకున్నవాడు, మెట్టినింటి వారు వేధించి తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషాద ఘటన కర్ణాటక ధర్వాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లై రెండు నెలలు కూడా నిండకుండానే అత్తింటి వారి ఘాతుకం.. నవ వధువు అనుమానాస్పద మృతి
Karnataka Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 24, 2023 | 12:58 PM

కాళ్ల పారాణి కూడా ఆరక ముందే నవ వధువును కడతేర్చాడో పతి దేవుడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. వరకట్నం కోసమే కట్టుకున్నవాడు, మెట్టినింటి వారు వేధించి తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషాద ఘటన కర్ణాటక ధర్వాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక ధర్వాడ జిల్లా అనేరికి గ్రామానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24)తో నెలన్నర కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు తరపువారు వరుడికి కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. సకల లాంచనాలతో కూతురిని అత్తారింటికి సాగనంపారు కూడా. వివాహానంతరం ములగంజ, షహనాజ్‌ బేగం దంపతుల కాపురం కొన్ని రోజుల పాటు సజావుగానే సాగింది. క్రమక్రమంగా ములగంజ అసలు స్వరూపం బయటపడసాగింది. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ములగంజ తల్లిదండ్రులు కూడా కొడుకుకి వత్తాసు పలికి షహనాజ్ బేగంను చిత్రహింసలకు గురిచేసేవారు. దీంతో ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి కన్నీటి కడగండ్లే మిగిలాయి. ఈ క్రమంలో రంజాన్ పండగ వేళ అందరూ హడావిడిగా ఉన్న సమయంలో షహనాజ్ బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త ములగంజ భార్య షహనాజ్ బేగం తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

షహనాజ్ బేగం మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. అనంతరం మృతురాలి భర్త, అత్తమామలపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో తమ కూతురిని హింసించి, హత్య చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!