AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream: ఐస్ క్రీమ్‌లోని వేలు ఎవరిదో కనిపెట్టిన పోలీసులు.. నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్ష..

ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిది కావచ్చని వెల్లడైంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఐస్‌క్రీం ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు. ఇప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవడంతో పాటు ఐస్ క్రీమ్ లో కనిపించిన తెగిన వేలు ఆ ఉద్యోగిదేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగి డీఎన్‌ఏ శాంపిల్ ను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక త్వరలో వెలువడనుంది.

Ice Cream: ఐస్ క్రీమ్‌లోని వేలు ఎవరిదో కనిపెట్టిన పోలీసులు.. నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్ష..
Human Finger Found In Icecream
Surya Kala
|

Updated on: Jun 19, 2024 | 3:11 PM

Share

మహారాష్ట్రలోని ముంబైలో జూన్ 13న ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ లో మనిషి వేలు కనిపించి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పురోగతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిది కావచ్చని వెల్లడైంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఐస్‌క్రీం ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు.

ఇప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవడంతో పాటు ఐస్ క్రీమ్ లో కనిపించిన తెగిన వేలు ఆ ఉద్యోగిదేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగి డీఎన్‌ఏ శాంపిల్ ను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక త్వరలో వెలువడనుంది. అప్పుడు తెగిపడిన వేలు ఫ్యాక్టరీ ఉద్యోగిదా కాదా అనే విషయం తేలిపోనుంది అని అంటున్నారు.

జూన్ 13న ముంబైలోని మలాడ్‌లో ఒక డాక్టర్ ఆన్‌లైన్ యాప్ ద్వారా తినడానికి 3 ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ చేసింది. డెలివరీ అయిన వెంటనే డాక్టర్ ఐస్ క్రీం ప్యాకింగ్ ఓపెన్ చేసింది. ఐస్‌క్రీమ్‌ని తినబోతున్న సమయంలో మనిషి వేలు కనిపించడంతో అతని నోటి నుండి అరుపు వచ్చింది. భయపడి అతను మొదట ఐస్ క్రీమ్ ను మళ్ళీ పరిశీలించాడు. తాను మోసపోయానని భావించాడు. అయితే మళ్లీ ఐస్‌క్రీమ్‌ని పరిశీలించే సరికి అది 2 సెంటీమీటర్ల మనిషి వేలు అని అర్థమైంది.

ఇవి కూడా చదవండి

యమ్మో కంపెనీకి చెందిన ఐస్‌క్రీమ్‌

దీంతో ఆ డాక్టర్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో మలాడ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మానవ వేలితో పాటు ఐస్‌క్రీమ్‌ను పరీక్షల నిమిత్తం పంపించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వేలు మనిషిదేనని తేలింది. దీంతో పోలీసులు పూణెలోని యమ్మో ఐస్‌క్రీం ఫ్యాక్టరీకి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఉద్యోగి పని చేస్తున్న సమయంలో వేలు కోసుకున్నట్లు అక్కడి విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి డీఎన్‌ఏ శాంపిల్‌ను తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ కోణంలో కేసు విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us