AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2.31కోట్ల నగదు, భారీగా బంగారం సీజ్‌.. అన్నీ 2వేల నోట్లే..!

అసలు ఆ డబ్బు, బంగారం ఆఫీసులోకి ఎలా వచ్చింది, అది ఎవరిదనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటుచేశామని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2.31కోట్ల నగదు, భారీగా బంగారం సీజ్‌.. అన్నీ 2వేల నోట్లే..!
Yojana Bhawan In Jaipur
Jyothi Gadda
|

Updated on: May 20, 2023 | 11:55 AM

Share

మే 19 శుక్రవారం నాడు 2000 నోట్లను నిషేధిస్తున్నట్లు వార్తలు రావటంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే ఒక ప్రభుత్వ కార్యాలయంలో దాడులు జరిపిన పోలీసులకు కళ్లు చెదిరిపోయేలా బంగారం, కోట్లలో నగదు కనిపించింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రికవరీ చేసిన నగదులో కేవలం 2వేలు, 500 నోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ షాకింగ్‌ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమీషనర్ సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్లు, బంగారు బిస్కెట్లు సీజ్‌ చేసినట్టుగా ప్రకటించారు.

శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్‌పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్‌బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు. బ్యాగు నిండా నోట్లకట్టలు. అందులో బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. జైపూర్‌లోని ఐటీ శాఖకు చెందిన యోజనా భవన్‌లో లెక్కల్లోకిరాని డబ్బును అధికారులు గుర్తించారు. నిర్ధిష్టమైన సమాచారంతో శుక్రవారం రాత్రి యోజనా భవన్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్‌చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఆ డబ్బు, బంగారం ఆఫీసులోకి ఎలా వచ్చింది, అది ఎవరిదనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటుచేశామని జైపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ శ్రీవాత్సవ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్  క్లిక్ చేయండి..