భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య.. తృటిలో తప్పించుకొని పారిపోయిన చిన్నారులు

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య.. తృటిలో తప్పించుకొని పారిపోయిన చిన్నారులు
Women Murder
Follow us

|

Updated on: May 20, 2023 | 10:45 AM

ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో  చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు వారి ఇద్దరు పిల్లలు అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా తెలిసింది.  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో దారుణం జరిగింది. భార్యను నరికి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి మండలం జన్వాడలో నివసిస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తారస్థాయికి చేరడంతో నాగరాజు.. భార్య గొంతుకోసి హతమార్చాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్‌నూ హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించాడు. దీంతో బాలుడు దీక్షిత్‌ తన తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ