AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌ గాంధీకి ముంబయి కోర్టు సమన్లు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు కోర్టు అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం సెప్టెంబరులో రఫేల్ అవినీతిపై మాట్లాడిన రాహుల్ పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన […]

రాహుల్‌ గాంధీకి ముంబయి కోర్టు సమన్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 2:27 PM

Share

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు కోర్టు అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం సెప్టెంబరులో రఫేల్ అవినీతిపై మాట్లాడిన రాహుల్ పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేత మహేశ్‌ శ్రీమాల్‌, రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. కేవలం ప్రధానినే కాకుండా బీజేపీ కార్యకర్తలందరినీ రాహుల్‌ అ గౌరవపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పలు సందర్భాల్లో ‘కాపలాదారుడే దొంగ’అని మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇందులో పిటిషనర్‌ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.