పార్లమెంట్ నుంచి విజయ్చౌక్ వరకు విపక్షాల ర్యాలీ.. కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు
Rahul Gandhi: రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల నిరసన కొనసాగుతోంది. ఇటు పార్లమెంటు లోపల.. అటు పార్లమెంటు వెలుపల ఆందోళన చేపడుతున్నారు.

రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల నిరసన కొనసాగుతోంది. ఇటు పార్లమెంటు లోపల.. అటు పార్లమెంటు వెలుపల ఆందోళన చేపడుతున్నారు. విజయ్చౌక్ నుంచి పార్లమెంట్ భవన్ వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీ తీశారు. రాజ్యాంగ విరుద్దంగా ఎంపీలను సస్పెండ్ చేశారని , వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను కేంద్ర మంత్రి హత్య చేసిన విషయం ప్రధాని మోదీకి తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా ప్రధాని మోడీ.. వారణాసి పర్యటనకు వెళ్లడం సరికాదన్నారు.
ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు.. 12 మంది ఎంపీల సస్పెన్షన్కు కారణం రాజ్యసభ ఛైర్మన్ , ప్రధాని మోదీ కాదని , ఆ ముగ్గురు పారిశ్రామికవేత్తలే అని విమర్శించారు. కీలకమైన బిల్లులను ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్.
#WATCH Opposition MPs hold a march from Parliament to Vijay Chowk demanding to revoke the suspension of 12 Rajya Sabha MPs pic.twitter.com/EmBpZ311Go
— ANI (@ANI) December 14, 2021
#WATCH | Congress leader Rahul Gandhi joins Opposition’s protest against suspension of 12 Rajya Sabha MPs at Gandhi Statue on Parliament premises in Delhi pic.twitter.com/KYSO4WJZmi
— ANI (@ANI) December 14, 2021
#WATCH | A minister killed farmers. PM is aware of it. Truth is that 2-3 capitalists are against farmers… These MPs were not suspended by RS chairman or PM but by the power that wants to steal farmers’ income. PM & the chairman are just implementors: Rahul Gandhi, Congress pic.twitter.com/FTP9FguSxo
— ANI (@ANI) December 14, 2021
ప్రధాని మోడీకి పార్లమెంటుపై గౌరవం లేదు.. చిదంబరం విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటుపై ఏ మాత్రం గౌరవం లేదని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం విమర్శించారు. డిసెంబరు 13న పార్లమెంటు దాడి ఘటనలో మృతులకు ప్రధాని మోడీ నివాళులర్పించకుండా.. వారణాసి పర్యటనకు వెళ్లారన్నారు. ప్రధాని మోడీ వారణాసి, అయోధ్యలాంటి చోటే కనిపిస్తారని.. పార్లమెంటులో కనిపించరంటూ చిదంబరం ధ్వజమెత్తారు.
Also Read..