Singer Alfaaz: పంజాబీ సింగర్‌ అల్ఫాజ్‌ని టెంపోతో ఢీ .. తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స

గాయకుడు అల్ఫాజ్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. గాయకుడు అల్ఫాజ్ చిత్రాన్ని పంచుకుంటూ, హనీ సింగ్ ఇలా వ్రాశాడు, "నిన్న రాత్రి నా సోదరుడు అల్ఫాజ్‌పై ఎవరో దాడి చేశారు.

Singer Alfaaz: పంజాబీ సింగర్‌ అల్ఫాజ్‌ని టెంపోతో ఢీ ..  తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
Singer Alfaaz
Follow us

|

Updated on: Oct 03, 2022 | 8:05 AM

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య మరవకముందే..  ఇప్పుడు మరో పంజాబీ సింగర్‌పై దాడి వార్త తెరపైకి వచ్చింది. గాయకుడు అల్ఫాజ్‌పై  వ్యక్తి దాడి చేశారు. ఈ  దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. రాపర్ హనీ సింగ్  ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అయితే వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించాడు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న సింగర్ ఆల్ఫాస్ ఫోటోను హనీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అతడి తలకు బలమైన గాయమైంది. చిత్రంలో అతని చేతిపై గాయం గుర్తులు కూడా కనిపిస్తాయి.

సమాచారం ప్రకారం.. గాయకుడు అల్ఫాజ్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. గాయకుడు అల్ఫాజ్ చిత్రాన్ని పంచుకుంటూ, హనీ సింగ్ ఇలా వ్రాశాడు, “నిన్న రాత్రి నా సోదరుడు అల్ఫాజ్‌పై ఎవరో దాడి చేశారు. ఎవరైతే ఈ ప్లాన్ వేసారో, నేను అతనిని వదిలిపెట్టను.. దయచేసి నా సోదరుడు క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలని ప్రార్థించండి. అయితే  ఇప్పుడు అతను కొత్త పోస్ట్ చేసాడు.. అందులో మొహాలీ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను సింగర్ ఆల్ఫాస్ ప్రమాదం నుండి బయటపడినట్లు తెలియజేసాడు.

ఇవి కూడా చదవండి

ఢీ కొట్టిన పికప్ టెంపో వాస్తవానికి, గాయకుడు అమంజోత్ సింగ్ పన్వార్ అలియాస్ అల్ఫాజ్‌ను పిక్-అప్ టెంపో ఢీ కొట్టినందుకు రాయ్‌పూర్ రాణి నివాసి విక్కీపై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోహానా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 279, 337, 338 సెక్షన్ల కింద పోలీసులు విక్కీపై కేసు నమోదు చేశారు. గాయకుడు అల్ఫాజ్ తన ముగ్గురు స్నేహితులు గుర్‌ప్రీత్, తేజీ , కుల్జీత్‌లతో కలిసి రాత్రి భోజనం చేసి పాల్ ధాబా నుండి బయటకు వస్తుండగా, విక్కీ ..  ధాబా యజమాని మధ్య గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. విక్కీ తనకు సహాయం చేయమని అల్ఫాజ్‌ని అభ్యర్ధించాడు. అయితే తన డబ్బు యజమాని ఇవ్వకపోవడంతో.. విక్కీ దాబా యజమాని టెంపోని తీసుకుని  పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అల్ఫాజ్‌ను ఆ టెంపోతో ఢీ కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.

మే 29న సిద్ధూ ముసేవాలా హత్య: దీనికి ముందు, మే 29న మాన్సా జిల్లాలో గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధు ముసేవాలా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆరవ, చివరి షూటర్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత నెలలో మాన్సా కోర్టులో దాఖలు చేసిన 1,850 పేజీల ఛార్జిషీట్‌లో, కరుడుగట్టిన నేరస్థుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు ప్రధాన కుట్రదారుడని ..  జగ్గు భగవాన్‌పురియా, లారెన్స్ బిష్ణోయ్, ఇతరులతో కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డాడని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు.

సిద్ధూ ముసేవాలా హత్య కేసులో పంజాబ్‌ పోలీసులు, కేంద్ర సంస్థలతో కలిసి ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు. మూసేవాలాపై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్ షూటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..