Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌ పై చికిత్స

ములాయం సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇరువురు నేతలు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి  సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ అఖిలేష్ కు ఫోన్‌లో తెలిపారు.

Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌ పై చికిత్స
Mulayam Singh Yadav
Follow us

|

Updated on: Oct 03, 2022 | 7:32 AM

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం మరింత విషమించింది. వెంటనే అతడిని గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూకి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ కూడా మేదాంతకు చేరుకున్నారు. మేదాంతలో శివపాల్, ప్రతీక్, అపర్ణ కూడా ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. ములాయం సింగ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇరువురు నేతలు అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి  సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ అఖిలేష్ కు ఫోన్‌లో తెలిపారు.

ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై సమాజ్ వాదీ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. నేతాజీని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ఐసీయూలో ఉంచారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో, మేదాంత ఆసుపత్రి PRO కూడా ఒక ప్రకటన విడుదల చేసి ములాయం సింగ్ ఆరోగ్యం గురించి తెలియజేశారు. యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు రక్తపోటు సమస్య బాగా పెరగడంతో ములాయం సింగ్ అడ్మిట్ అయ్యారని తెలిపారు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఐసీయూకి తరలించారు. పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉంచారు. మేదాంత హాస్పిటల్ ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదు. మొత్తం సమాచారాన్ని అఖిలేష్ యాదవ్‌కు అందించినట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం

ఇవి కూడా చదవండి

ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్ చాలా కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ములాయం సింగ్ యాదవ్‌కు పొత్తికడుపు నొప్పి , యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఇబ్బందులున్నాయి. ఆరోగ్యం మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన మరోసారి అదే సమస్యతో ఆసుపత్రిలో చేరారు.

ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఇంతకు ముందు చాలాసార్లు క్షీణించింది.  గతేడాది జులై 1న కూడా ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు.  అప్పుడు కూడా  ఐసీయూలో ఉంచి చికిత్సనందించారు. ఇటీవల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. జూలై నెలలో, కరోనాతో భార్య సాధన గుప్తా మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..